Telangana: మేడారం అడవుల్లో వింత.. ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు..!

తెలంగాణలోని ఏటూరునాగారం - మేడారంలోని అడవుల్లో, అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి.

Telangana: మేడారం అడవుల్లో వింత.. ఒకేసారి నేల కూలిన 50వేలకుపైగా మహా వృక్షాలు..!
Wildlife Sanctuary
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 03, 2024 | 3:22 PM

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం – మేడారంలోని అడవుల్లో, అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రి 50,000 పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల, తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఒకేసారి నేలమట్టమైన 50 వేలకు పైగా చెట్లు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాయి. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖ తోపాటు అటవీశాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 31వ తారీఖున సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలజడి. పెద్ద ఎత్తున గాలి దుమారం. మహావృక్షాలు సైతం చిగురుటాకులా వణికిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50వేలకు పైగా వృక్షాలు నేల కూలాయి. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణం అంటున్నారు నిపుణులు. ఇదంతా టోర్నడోలు వల్ల జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా, టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే, ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి, అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్‌గా అనేక కారకాల వల్ల ఏర్పడుతుందనీ, వీటిలో అధిక వేగంతో కూడిన గాలులు, అవీ సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవడం ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ఎక్కువ ప్రభావం చూపిందని వారు చెప్పారు.

వాతావరణ శాఖ, అటవీశాఖ ఈ సంఘటనను మరింత వివరంగా పరిశీలించేందుకు, శాటిలైట్ డేటా తోపాటు ఇతర పరికరాలను ఉపయోగించి ఈ ప్రాంతంలో మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు ఇవే..
'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి'
'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి'
రాత్రికి రాత్రి ఒకే టైంలో.. నేలకూలిన 50వేలకు పైగా చెట్లు..!
రాత్రికి రాత్రి ఒకే టైంలో.. నేలకూలిన 50వేలకు పైగా చెట్లు..!
వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం
వర్షాకాలంలో వైష్ణోదేవి గుడికి వెళ్తున్నారా ఈ విషయాలు గుర్తుంచుకోం
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ .. ఆ ఇద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ .. ఆ ఇద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి
ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్
ఈ ఫ్రాంచైజీతో భారీగా ఆదాయం.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్
ఆచి తూచి అడుగులేస్తున్న దేవర.. వార్ 2 కూడా క్లోజ్. నెక్స్ట్ ..?
ఆచి తూచి అడుగులేస్తున్న దేవర.. వార్ 2 కూడా క్లోజ్. నెక్స్ట్ ..?
ఎవరినీ వదిలిపెట్టం.. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థ: రేవంత్
ఎవరినీ వదిలిపెట్టం.. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థ: రేవంత్
బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు..
బైక్‌లకు ఏమాత్రం తీసుపోని బెస్ట్ ఈ-సైకిళ్లు..
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలంటే..?
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గణపతి బొమ్మను ఉంచితే ఎలాంటి ఫలితాలంటే..?