Telangana: టైమ్, ప్లేస్ డిసైడ్ చెయ్.. మంత్రి కేటీఆర్కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్..
మంత్రి కేటీఆర్కు బహిరంగ సవాల్ విసిరారు టి.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్. టైమ్, డేట్ను మంత్రి కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందామని

మంత్రి కేటీఆర్కు బహిరంగ సవాల్ విసిరారు టి.కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు రేవంత్. టైమ్, డేట్ను మంత్రి కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
గురువారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్.. టీవీ9 సాక్షిగా చర్చకు తాను సిద్ధం అని ప్రకటించారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు వచ్చేందుకు తాను సిద్ధం అన్నారు. ఇదే సమయంలో కవితపై ఈడీ విచారణపై షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్. బీజేపీ, బీఆర్ఎస్ నాటకంలో పార్ట్ ఈడీ విచారణ అని విమర్శించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీది మిత్రబంధం అన్నారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని, ఈ విషయం చాలా సాధారణ విషయం అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.
సోనియా గాంధీని ఈడీ విచారించిన మసంయలో ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై తానుు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని అన్నారు రేవంత్ రెడ్డి.




అమర వీరుల స్థూపం, అంబెడ్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఎంపీ రేవంత్. ప్రశాంత్ రెడ్డి అవినీతిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేసి తేలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ లేవని, వివాదాలు లేవని అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్. మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాక్రే కు లేఖ రాసిన విషయం తన దృష్టికి రాలేదని, ఠాక్రే తనతో మాట్లాడలేదన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో తాము ఓట్లు అడగబోమని, అదే ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని సవాల్ విసిరారు. ఇదిలాఉంటే.. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
