AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crack Free Heels: ఈ వేసవిలో మడమలకు పగుళ్లు వస్తున్నాయా? ఇలా చేస్తూ స్మూత్‌గా ఉంటాయి..

వేసవిలో చాలా మంది పాదాలు పగిలిపోతుంటాయి. ఫలితంగా ఓపెన్ టోడ్ బూట్లు, చెప్పులు ధరించడానికి ఇబ్బంది పడుతారు.

Crack Free Heels: ఈ వేసవిలో మడమలకు పగుళ్లు వస్తున్నాయా? ఇలా చేస్తూ స్మూత్‌గా ఉంటాయి..
Cracked Heels
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 15, 2023 | 6:22 PM

వేసవిలో చాలా మంది పాదాలు పగిలిపోతుంటాయి. ఫలితంగా ఓపెన్ టోడ్ బూట్లు, చెప్పులు ధరించడానికి ఇబ్బంది పడుతారు. అయితే, పగిలిన మడమలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైద్య చికిత్సతో పాటు.. వంటింటి చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాదాలను క్రమంతప్పకుండా మాయిశ్చరైజ్ చేయాలి..

మడమల పగుళ్లకు ప్రధాన కారణం పొడి చర్మం. అందుకే పాదాలను క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయాలి. పడుకునే ముందు మడమలు, పాదాలకు క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ వంటి క్రీమ్స్‌ అప్లై చేయాలి. ఇది తేమను లాక్ చేయడంలో సహాయపడుతుంది. మడమలు పొడిగా, పగుళ్లు రాకుండా చేస్తుంది.

పాదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయాలి..

డెడ్ స్కిన్ సెల్స్ మీ పాదాలపై పేరుకుపోయి వాటిని గరుకుగా, పొడిగా మారుస్తుంది. దీనిని నివారించడానికి, పాదాలను క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. మడమల నుండి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఫుట్ స్క్రబ్ లేదా ప్యూమిస్ స్టోన్ ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

పుష్కలంగా నీరు త్రాగాలి..

డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది మడమల పగుళ్లకు దారితీస్తుంది. అందువల్ల, మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగటం చాలా అవసరం.

సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి..

అసౌకర్యమైన బూట్లు ధరించడం వల్ల మడమల మీద ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల, సౌకర్యవంతమైన బూట్లు ధరించడం చాలా అవసరం. చాలా బిగుతుగా ఉన్న లేదా హైహీల్స్ ఉన్న బూట్లు వేసుకోవడం మానుకోవాలి.అవి మీ మడమల మీద ఒత్తిడిని కలిగిస్తాయి.

చెప్పులు లేకుండా నడవడం మానుకోండి..

పాదరక్షలు లేకుండా నడవడం వల్ల పాదాలు ధూళి, బ్యాక్టీరియాకు గురవుతాయి. ఇది ఇన్ఫెక్షన్లు, పొడి చర్మానికి దారితీస్తుంది. అందుకే సాధ్యమైనప్పుడల్లా సాక్స్ లేదా బూట్లు ధరించడం చాలా అవసరం. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్, లాకర్ రూమ్‌లు వంటి బహిరంగ ప్రదేశాలలో పాదరక్షలు వేసుకునే నడవాలి.

పాదాలను గోరువెచ్చని నీటితో నాన్చాలి..

పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల మడమలను మృదువుగా చేసుకోవచ్చు. వేడి నీటిలో నానబెట్టడం వల్ల పాదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం సులభం అవుతుంది. అదనపు ప్రయోజనాల కోసం నీటిలో ఎప్సమ్ ఉప్పు లేదా ముఖ్యమైన నూనెలను యాడ్ చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..