Tiger Fear: అమ్మో పులి.. ఆ ప్రాంతంలోనే తిష్ట వేసింది.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు వాసులూ అలర్ట్..

Tiger: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో మ్యాన్‌ఈటర్‌ టైగర్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. మనుషులతో పాటు పశువుల మందలపై విరుచుకుపడుతున్న పులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tiger Fear: అమ్మో పులి.. ఆ ప్రాంతంలోనే తిష్ట వేసింది.. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు వాసులూ అలర్ట్..
Tiger
Follow us

|

Updated on: Dec 04, 2022 | 8:58 PM

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో మ్యాన్‌ఈటర్‌ టైగర్‌ టెర్రర్‌ కొనసాగుతోంది. మనుషులతో పాటు పశువుల మందలపై విరుచుకుపడుతున్న పులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు వెళ్లిన పులి తిరిగి తెలంగాణ లోకి వచ్చే అవకాశముందని సరిహద్దు గ్రామాల్లో అలర్ట్‌ జారీ చేశారు.

బెబ్బులి దడ పుట్టిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్‌లో మ్యాన్‌ఈటర్‌ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన పశువులు, మనుషులపై పంజా విసురుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్దపులి తిష్టవేసినట్టు ఫారెస్ట్‌ శాఖ అధికారులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లిన జంగు అనే వ్యక్తి పీక కొరికి చంపేసింది. పులి పంజా దెబ్బకు శరీరం నుంచి తల వేరు అయింది. మనుషులనే కాదు తమ జాతికి చెందిన పులులపై కూడా ఈ మ్యాన్‌ ఈటర్‌ దాడి చేస్తోంది.

తోటి పులులపైనా దాడి..

ఈ మ్యాన్ ఈటర్ మనుషులనే కాదు.. తమ జాతికి చెందిన పులులపై కూడా దాడి చేస్తోంది. షేయోని ఫారెస్ట్ రేంజ్‌లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని 3 రోజలు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తాడోబ టైగర్ రిజర్వు పారెస్ట్‌లో నాలుగు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. మరణించిన పులి పిల్లల వయసు 3-4 ఏళ్ల మధ్య ఉందన్నారు ఫారెస్టు ఆఫీసర్స్‌. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోనే ఇవి కూడా కనిపించినట్టు తాడోబా-అంధారి టైగర్ రిజర్వు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చనిపోయిన పులి పిల్లల్లో రెండు మగవి కాగా, మిగతా రెండు ఆడవి. చనిపోయిన నాలుగు పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నాయని, దీనిని బట్టి చూస్తే ఆ మగ పులే వాటిని చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కి తరలించారు.

వారం రోజుల్లో ఆరు పులులు, ఓ వ్యక్తి మృతి..

తాడోబ ఫారెస్టులో టెరిటోరియల్‌ ఫైట్‌ నడుస్తోంది. పశువులు, మనుషులపై దాడితో లక్కాడికోట్‌, వాంకిడి ప్రజలు వణికిపోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరు పులులు, ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న మ్యాన్‌ఈటర్‌ను పట్టుకునేందుకు ఫారెస్టు సిబ్బంది ట్రాప్‌ కెమెరాలు, టైగర్‌ ట్రాకర్లతో పులివేట కొనసాగుతోంది. అయితే మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలో ఉన్న కవ్వాల్‌ అటవీప్రాంతంలోకి మ్యాన్‌ఈటర్‌ ఎంటరయ్యే అవకాశం అవకాశం ఉంది.

కొమురంభీంజిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌లో గతనెల 14న గిరిజన రైతు సిడాం భీంపై మ్యాన్‌ ఈటర్‌ దాడి చేసింది. అయితే తాజాగా లక్కాడికోట్‌లో పశువులకాపరి జంగుపై దాడి చేసింది కూడా ఒకేపులి అని ఫారెస్టు సిబ్బంది గుర్తించారు. ఈ రెండు పులులు ఒక్కటేనని ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. దాంతో చంద్రపూర్ జిల్లా – కొమురంభీం జిల్లాల సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేశారు ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..