Hyderabad: త్వరలో తీరనున్న భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు.. డిసెంబర్‌లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ ఓపెన్‌కు సన్నాహాలు..

Hyderabad: మినీ భారత దేశంగా పేరు గాంచిన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ జనాభా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన..

Hyderabad: త్వరలో తీరనున్న భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలు.. డిసెంబర్‌లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ ఓపెన్‌కు సన్నాహాలు..
Hyderabad Flyovers
Follow us

|

Updated on: Nov 09, 2021 | 4:55 PM

Hyderabad: మినీ భారత దేశంగా పేరు గాంచిన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ జనాభా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ అధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం  చేపట్టింది.  ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలు జిహెచ్ఎంసి చేపట్టింది.

జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగం.. దీంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ట్రాఫిక్ ను  అధిగమించి గమ్యానికి చేరడానికి చాలా ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు నిర్మించడానికి రెడీ అవుతున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లతో ప్రయాణీకులు  అలసట లేకుండా త్వరితగతిన గమ్య స్థానం చేరేందుకు వెసులుబాటు కలుగుతుంది.  ఈ నేపథ్యంలో నగరంలో అవసరం కావాల్సిన ఫ్లై ఓవర్లు, అండర్ పాసు ల నిర్మాణాలను పలు చోట్ల కోట్లాది రూపాయలతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో మిధాని జంక్షన్ నుండి ఓవైసి ఆసుపత్రి జంక్షన్ వరకు ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వద్ద రూ. 63 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1.40 కిలోమీటర్ల దూరం గల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 12 మీటర్ల వెడల్పు, యూని డైరెక్షన్ లో మూడు లైన్ల ఫ్లై ఓవర్ డిసెంబర్ మాసం చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందుకు 38 పిల్లర్ లనిర్మాణ పనులు పూర్తయ్యాయి. 33 గిల్డర్స్ గల 132 స్పన్స్ ఫిట్ చేయడం జరిగింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో బి.టి రోడ్డు పనులు పురోగతిలో ఉంది . A1 ర్యాంపు సి.అర్.సి.పి పనులు పూర్తి కాగా A2 ర్యాంపు పనులు పురోగతిలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులు వివిధ అభివృద్ది దశలో ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరుకి బ్రిడ్జిని ప్రారంభించాలనే లక్ష్యంతో జి హెచ్ ఎం సి అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో భాగ్యనగర వాసులకు చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని తెలుస్తోంది.

Also Read:  నాగార్జున సాయంతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్..