Sangareddy: ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కుపోయాడు.. రెక్కి నిర్వహించడానికి వచ్చిన దొంగ, చివరికి ఏమైందంటే
చెడ్డి గ్యాంగ్ పేరుతో చాలా చోట్ల కలకలం సృష్టిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో హల్చల్ చేస్తున్నారు. చెడ్డి గ్యాంగ్ ఇప్పుడు ఈ పేరు వింటేనే జనాలు హడలిపో తున్నారు. ఈ గ్యాంగ్ ఎప్పుడు ఎక్కడ ఎలా దొంగతనం చేస్తుందో పోలీసులకు కూడా అంతుచిక్కడం లేదు. కనీసం వారిని పట్టుకోవడానికి ఏ రకమైన ఆధారాలు కూడా లభించడం లేదు. ఈ చెడ్డి గ్యాంగ్ సంబంధించిన దొంగలు నలుగురు, ఐదుగురు కలిసి ఒక టీంగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి టీమ్లే ఇప్పుడు...

సంగారెడ్డి, ఆగస్టు 21: ఒంటరిగా ఉండే వాళ్ల ఇళ్లే వారి టార్గెట్, తాళాలు వేసి ఉన్న ఇళ్లు.. జనసంచారం లేనిప్రాంతలనే ఎంచుకుంటారు. పొద్దంతా ఆ ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తారు. రాత్రి అయితే ఆ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేస్తారు. ఇదంతా చదువుతుంటే ఇదోదే క్రైమ్ సినిమా స్టోరీని తలపిస్తోంది కదూ! కానీ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వాసులు ఇలాంటి భయాన్నే అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెడ్డి గ్యాంగ్ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోనూ హల్చల్ చేస్తున్నారు.
చెడ్డి గ్యాంగ్ పేరుతో చాలా చోట్ల కలకలం సృష్టిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో హల్చల్ చేస్తున్నారు. చెడ్డి గ్యాంగ్ ఇప్పుడు ఈ పేరు వింటేనే జనాలు హడలిపో తున్నారు. ఈ గ్యాంగ్ ఎప్పుడు ఎక్కడ ఎలా దొంగతనం చేస్తుందో పోలీసులకు కూడా అంతుచిక్కడం లేదు. కనీసం వారిని పట్టుకోవడానికి ఏ రకమైన ఆధారాలు కూడా లభించడం లేదు. ఈ చెడ్డి గ్యాంగ్ సంబంధించిన దొంగలు నలుగురు, ఐదుగురు కలిసి ఒక టీంగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి టీమ్లే ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. పటాన్చెరు మొత్తం పారిశ్రామిక ప్రాంతం కావడంతో, ఇక్కడ ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం చాలా మంది వస్తుంటారు. ఉదయం పూట పలు కంపెనీలలో పనులు చేస్తూ.. కొంతమంది రాత్రి సమయంలో ఇలా దొంగతనాలకు పాల్పడతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చెడ్డీ గ్యాంగ్ ఈ చడ్డి గ్యాంగే నిన్న పటాన్చెరులో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు కలిసి పటాన్చెరులోని గీతా సదన్ అపార్ట్మెంట్లో రెక్కీ నిర్వహించి.. దొంగతనానికి వచ్చారు దొంగల కదిలికలతో అలెర్ట్ అయినా అపార్ట్మెంట్ వాసులు చెడ్డి గ్యాంగ్ దొంగలను పట్టుకోనే ప్రయత్నం చేశారు. గమనించిన ఆ చెడ్డి గ్యాంగ్ లో నలుగురు దొంగల్లో ముగ్గురు దొంగలు పారిపోగా, ఒక దొంగ మాత్రం బాత్ రూమ్లో దాక్కొని ఉండిపోయాడు. అది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు ఆ వ్యక్తిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు.





బాత్రూమ్లో ఇరుక్కుపోయిన దొంగను విచారిస్తున్న పోలీసులు
దొరికిన దొంగను వివరాలు అడిగగా, తాము బీహార్ నుంచి వచ్చామని నలుగురు వ్యక్తులు కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డామని, ఆ ముగ్గురు పారిపోయారు అని తమంత బీహార్ ప్రాంతానికి చెందిన వారమని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని పటాన్చెరులోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ చెడ్డి గ్యాంగ్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి కనుక ప్రజలు అందరు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
