AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: “రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు”.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్

యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్(CM KCR) ముందే సూచించారని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. అయినప్పటికీ రైతులను రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చగొట్టి వరి...

KTR: రెచ్చగొట్టి వరి వేయించారు.. కొనమంటే నాటకాలు ఆడుతున్నారు.. బీజేపీ లీడర్స్ పై కేటీఆర్ ఫైర్
Ktr
Ganesh Mudavath
|

Updated on: Apr 09, 2022 | 5:49 PM

Share

యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్(CM KCR) ముందే సూచించారని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. అయినప్పటికీ రైతులను రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చగొట్టి వరి వేయించారని విమర్శించారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని, తెలంగాణ(Telangana) ఆత్మగౌరవ పోరాటమని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రంమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్త్ర వ్యాప్త నిరసనలు చేపడుతున్నారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల మద్దతుతో నిర్వహించే ఈ నిరసనల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొంటున్నారు.

యాసంగి వడ్లు కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని ముందే రైతులకు కేసీఆర్ సూచించారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం కూడా.

                      – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరోవైపు.. టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర దాగి ఉందని, తెలంగాణ రైతు సమాజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లేఖ రాశారు. దళారుల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీగా కమీషన్లు దండుకునేందుకు వ్యూహాలు పన్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని ఆక్షేపించారు. కేసీఆర్ కుట్రలను ఛేదించేందుకు అన్నదాతలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. రైతు పండించే ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Also Read

Andhra Pradesh: జగన్‌ కొత్త క్యాబినేట్‌లో మళ్లీ ఛాన్స్ దక్కనుందా? కొడాలి నాని ఏమన్నారంటే..

Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్.. పూర్తి వివరాలివే..

అభిమానుల ముందువచ్చి సందడి చేసిన మహానటి కీర్తి సురేష్…

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్