Narayana College: మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మాదాపూర్‌ నారాయణ కాలేజీలో అకనక రాజు అనే విద్యార్థి ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్లాస్‌ నిర్వహిస్తున్న సమయంలో కనకరాజు కనిపించలేదు. అటెండెన్స్‌ తీసుకుంటున్న తరగతి ఉపాధ్యాయుడు కనకరాజు లేకపోవడంతో అతని గదికి వెళ్లి చూడమని సిబ్బందికి సూచించాడు. గది వద్దకు చేరుకున్న సిబ్బంది గదిలో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనకరాజు కనిపించాడు. దీంతో యాజమన్యం పోలీసులకు సమాచారం అందించారు..

Narayana College: మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Student Suicide
Follow us

|

Updated on: Aug 11, 2023 | 7:20 PM

హైదరాబాద్‌, ఆగస్టు 11: చదువుల ఒత్తిడి మరో విద్యార్థి జీవితాన్ని చిత్తు చేసింది. మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోన్న విద్యార్థి శుక్రవారం (ఆగస్టు 11) తన గదిలో ఫ్యాన్‌కు ఉరి పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే..

మాదాపూర్‌ నారాయణ కాలేజీలో అకనక రాజు అనే విద్యార్థి ఇంటర్‌ బైపీసీ సెకండియర్‌ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత క్లాస్‌ నిర్వహిస్తున్న సమయంలో కనకరాజు కనిపించలేదు. అటెండెన్స్‌ తీసుకుంటున్న తరగతి ఉపాధ్యాయుడు కనకరాజు లేకపోవడంతో అతని గదికి వెళ్లి చూడమని సిబ్బందికి సూచించాడు. గది వద్దకు చేరుకున్న సిబ్బంది గదిలో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనకరాజు కనిపించాడు. దీంతో యాజమన్యం పోలీసులకు సమాచారం అందించారు.

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్ధి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదువులో బాగా రాణించేవాడని, ఫస్ట్‌ ఇయర్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయని కాలేజీ యాజమాన్యం పోలీసులకు తెల్పింది. తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వాళ్లను ప్రశ్నిస్తే కనరాజుకి ఉన్న సమస్యేంటో బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా రాజేంద్రనగర్‌లో ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇటీవల ఓ ఉద్యోగి మృతి చెందిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఈ విషయం స్థానికంగా చర్చణీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌లోని కోటాలో ఆగని విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఐఐటీ జేఈఈకి కోచింగ్ తీసుకుంటున్న మనీశ్‌ ప్రజాపతి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 19 మందికి చేరింది. ఆగస్టు నెలలోనే ఇది మూడో ఘటన కావడం విశేషం.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన మనీశ్‌ ప్రజాపతి (17) ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు కోచింగ్‌ తీసుకోవడానికి 4 నెలల క్రితం కోటాలోని కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. గురువారం మనీశ్‌ను కలిసేందుకు అతడి తండ్రి వచ్చి.. అదే రోజు సాయంత్రం మనీశ్‌ను హాస్టల్ వద్ద వదిలిపెట్టి అతను తిరిగివెళ్లిపోయాడు. ఊరి చేరుకోకముందే రాత్రి 8 గంటల సమయంలో కుమారుడు మనీశ్‌కు ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్‌కు ఫోన్‌ చేసి చేయగా.. వార్డెన్‌ వెంటనే హాస్టల్‌ గది వద్దకు వెళ్లాడు. మనీశ్‌ ఎంతకూ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూసిన వార్డెన్‌కు ఫ్యాన్‌కు వేలాడుతూ మనీశ్‌ కనిపించాడు. బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కుమారుడిని కలిసిన కొద్దిగంటల్లోనే మరణవార్త వినడంతో తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కాగా మనీష్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పలు ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ‘కోటా’ అడ్డగా ఉంది. వివిధ రాష్ట్రాల ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి కోచింగ్‌ తీసుకుంటుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది విద్యార్ధులు అక్కడ పలు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ