AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Formation Day: నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అంబరాన్నంటేలా సంబరాలు..

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు.. తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ..

Telangana Formation Day: నేడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అంబరాన్నంటేలా సంబరాలు..
Telangana
Shiva Prajapati
|

Updated on: Jun 02, 2023 | 5:49 AM

Share

తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్‌ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు.. తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ.. అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ.. దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 10:20 గంటలకు అసెంబ్లీ దగ్గర అమరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తరువాత 10:30 గంటలకు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు.

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలు దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుకోవడం అత్యద్భుతమని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఆరు దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.

హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా ఉదయం 7:30 గంటలకు జెండా ఎగురవేస్తారు. ఇవాళ్టి నుంచి 21 రోజుల పాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాలు జరపనుంది ప్రభుత్వం. ఈ ఆవిర్భావ వేడుకల కోసం ప్రభుత్వం రూ.105 కోట్ల నిధులను కేటాయించింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్‌ తమిళసై.

ఇవి కూడా చదవండి

మరోవైపు గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది బీజేపీ. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డి గోల్కొండ కోటకు వెళ్ళి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా.. చారిత్రక గోల్కొండ కోటపై ఇవాళ ఉదయం 7:10 గంటలకు జాతీయపతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కిషన్‌ రెడ్డి. తెలంగాణ సాధన ఏ ఒక్కరివల్లో సాధ్యం కాలేదనీ, సకల జనుల సమైక్య పోరాటంతో, 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యిందన్నారు.

మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు తమనే ఆదరిస్తారంటుంన్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధకురాలు సోనియా గాంధీయేనని, పాలాభిషేకాలకు సిద్ధమౌతున్నారు. పదివేల మందితో హైదరాబాద్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సభకు చీఫ్ గెస్ట్ గా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ హాజరవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..