AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS Meeting: ఇవాళ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం.. దళితబంధుపై అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం

పాలనలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు.. ఇక పార్టీ పోకస్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం...

TRS Meeting: ఇవాళ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం.. దళితబంధుపై అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం
Telangana CM KCR
Balaraju Goud
|

Updated on: Aug 24, 2021 | 12:20 PM

Share

TRS Executive Committee Meeting: పాలనలో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు.. ఇక పార్టీపై పోకస్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమో దు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌.. పార్టీ శ్రేణులు , కార్యకర్తలతో పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్‌ ఉపఎన్నికల అంశాలపై చర్చించనున్నారు. అదే విధంగా దళిత బంధు పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. దళిత బంధు పథకం అమలులో పార్టీ శ్రేణుల బాధ్యతలేమిటి… విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

కాగా, ఈ సందర్బంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ మార్గదర్శం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి మంగళవారం జరిగే సమావేశంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక, ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళితబంధు పథకం అమలు తీరుతెన్నులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కృషిపై అధినేత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధాకర్తగా పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో అధినేత వెల్లడించనున్నట్టు తెలిసింది.

పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యే సమావేశంలో దళితబంధు ప్రాధాన్యతలు, పథకం రూపకల్పన వెనక ఉద్దేశ్యాలను కేసీఆర్ వివరించనున్నారు. ఇప్పటికే పథకం అమలుపై పలుమార్లు సమీక్ష నిర్వహించిన సీఎం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన గ్రామాల మాదిరిగా దళిత కాలనీలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా సొమ్మును పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బీమా సంస్థలకు అందజేశారు.

Read Also….  Honey Trap: తియ్యని మాటను కమ్మగా విసిరి.. స్వర్గపుటంచులదాకా తీసుకెళ్లి.. పాతాళంలో పడేస్తున్న కి‘లేడీ’లు

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..