AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన సీఎస్ శాంతికుమారి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన సీఎస్ శాంతికుమారి
Rain Alert
Aravind B
|

Updated on: Jul 21, 2023 | 11:14 AM

Share

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అయితే, మహారాష్ట్రలో వర్షాలు తగ్గి అక్కడనుండి వరదల ప్రవాహం తగ్గుతున్నందున.. భద్రాచలం వద్ద కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని అన్నారు. అయినప్పటికీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అన్ని జిల్లాల్లో సరిపడా మందులు, విద్యుత్ పరికరాలు సిద్ధంగా ఉంచామని చెప్పారు.

భద్రర్ది కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పనిచేసిన మాజీ కలెక్టర్లు అనుదీప్, కృష్ణ ఆదిత్యలను తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని సి.ఎస్ ఆదేశించారు. ఏవిధమైన సహాయ సహకారాలైనా రాష్ట్ర రాజధాని నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలనుండి బాధితులను తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి