AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ నియోజకవర్గంపై కన్నేసిన బండ్ల గణేశ్.. లో‌క్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ధీమా

బండ్ల గణేశ్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. చిన్న కమెడియన్ నుంచి ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నారు. బండ్ల గణేష్‌ ఫిబ్రవరి 2న శుక్రవారం గాంధీభవన్‌లో మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Telangana: ఆ నియోజకవర్గంపై కన్నేసిన బండ్ల గణేశ్.. లో‌క్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ధీమా
Producer Bandla Ganesh
Srikar T
|

Updated on: Feb 02, 2024 | 6:54 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 02: బండ్ల గణేశ్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. చిన్న కమెడియన్ నుంచి ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్నారు. బండ్ల గణేష్‌ ఫిబ్రవరి 2న శుక్రవారం గాంధీభవన్‌లో మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడారు.

మల్కాజ్‎గిరి నియోజకవర్గం విషయానికొస్తే.. 2019 నాటికి 31,50,303 మంది ఓటర్ల సంఖ్యతో మల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా స్థాయిని పెంచుకుంది. 2014-2019 వరకు ఎంపీగా మల్లా రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కొనసాగారు. ప్రస్తుతం బీఆర్ఎస్‎లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం తెలంగాణలోనే ఒక ముఖ్యమైన రాజకీయ యుద్ధభూమిగా ఉంది. పెద్ద సంఖ్యలో విద్యావంతులు, మధ్యతరగతి ఓటర్లు ఉన్నందున వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ అభ్యర్థలను ఆకర్షిస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్:

తెలంగాణలో కాంగ్రెస్ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లను జనవరి 30న విడుదల చేసింది. దరఖాస్తులను మార్చి 3 వరకు పరిశీలిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పరిధిలో ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కోరుతూ పలువురు పార్టీ నేతలు ఇప్పటికే దరఖాస్తులు గాంధీభవన్‎లో సమర్పించారు. రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు పార్టీ హైకమాండ్‌కు అధికారం ఇస్తూ టీపీసీసీ తీర్మానం చేసింది. బీజేపీని ఓడించాలన్న ఉద్దేశంతో రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!