AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivas Reddy: ఖమ్మం SR గార్డెన్స్‌లో రెవెన్యూ అధికారుల సర్వే.. పోలీసులు, అధికారులతో పొంగులేటి వర్గీయుల వాగ్వాదం

Khammam News: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన SR గార్డెన్స్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. SR గార్డెన్స్‌ నందు పోలీసుల సమక్షంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ల్యాండ్‌ సర్వేకు ప్రయత్నించారు. SR గార్డెన్స్‌ స్థలంలో ఎన్‌ఎస్పీ..

Ponguleti Srinivas Reddy: ఖమ్మం SR గార్డెన్స్‌లో రెవెన్యూ అధికారుల సర్వే.. పోలీసులు, అధికారులతో పొంగులేటి వర్గీయుల వాగ్వాదం
Ponguleti
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2023 | 9:07 PM

Share

ఖమ్మం, జూలై 17: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన SR గార్డెన్స్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. SR గార్డెన్స్‌ నందు పోలీసుల సమక్షంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ల్యాండ్‌ సర్వేకు ప్రయత్నించారు. SR గార్డెన్స్‌ స్థలంలో ఎన్‌ఎస్పీ భూమి ఉందంటూ జాయింట్ సర్వే చేయబోయారు. అయితే.. మార్కింగ్‌ పెట్టేందుకు అధికారులు ప్రయత్నించగా.. పొంగులేటి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు పరిధిలో ఉంటే ఎలా సర్వే చేస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం.. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పొంగులేటి అనుచరులు. ఇక.. ఎస్ఆర్ గార్డెన్స్‌ స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

ఇదిలావుంటే… హైకోర్టు ఆదేశాలతోనే ఇరిగేషన్‌, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి.. మార్కింగ్‌ చేశామన్నారు ఖమ్మం అర్బన్‌ ఎమ్మార్వో శైలజ. పొంగులేటి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్‌వోసీ కోసం ఇరిగేషన్‌ అధికారులకు దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. ధర్మాసనం ఆదేశాల మేరకు సర్వే చేపట్టామని.. SR గార్డెన్స్ యాజమాన్యాన్ని పిలిచినప్పటికీ హాజరు కాలేదని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం