AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: పాదయాత్రపై సందిగ్ధం.. అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని షోకాజ్ నోటీసులు..

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర పునః ప్రారంభిస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించగా.. పోలీసుల నుంచి...

YS Sharmila: పాదయాత్రపై సందిగ్ధం.. అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని షోకాజ్ నోటీసులు..
Ys.sharmila
Ganesh Mudavath
|

Updated on: Dec 04, 2022 | 8:15 AM

Share

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర పునః ప్రారంభిస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించగా.. పోలీసుల నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వైస్ఎస్ షర్మిల పాదయాత్రపై షోకాజ్ నోటిసులు అందజేసిన పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల అనుమతి కోసం షర్మిల చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వల్లనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని పోలీసులు ఆధారాలు చూపించారు. ప్రస్తుతం పాదయాత్ర అనుమతి ఎందుకు ఇవ్వాలో చెప్పాలని పోలీసులు కోరారు. అయితే కోర్టు ద్వారా పోలీసుల నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వైఎస్సార్టీపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. షర్మిల ఇచ్చే వివరణపై పోలీసులు సంతృప్తి చెందితేనే పాదయాత్రకు అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. వైఎస్.షర్మిల వరంగల్ జిల్లా పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ధ్వంసమైన కారులోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను మార్గమధ్యంలో అడ్డుకున్నారు. కారు దిగాలని కోరినా.. ఆమె దిగకపోవడంతో క్రేన్ సహాయంతో కారును ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం తీవ్ర నాటకీయ పరిస్థితుల నడుమ ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ ఘటనపై వైఎస్.విజయమ్మ స్పందించారు. నిరసన తెలిపితే అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఇన్సిడెంట్ పై వైఎస్ షర్మిల రెస్పాండ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రను టీఆర్‌ఎస్‌ గూండాలు అడ్డుకొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని మండిపడ్డారు. తన పాదయాత్రను, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని తేల్చి చెప్పారు. అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అయినప్పటికీ వారు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..