Hyderabad: అర్ధరాత్రి కారు బీభత్సం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు .. కారునడిపిన యువతి సాప్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తింపు

తిరుమలగిరి నుండి మిలటరీ డైరీ ఫార్మ్ వైపు ప్రయాణిస్తూ ఉండగా జరిగిన ప్రమాదం చోటు చేసుకుందిట. కారు నడిపిన యువతిని పోలీసులు గుర్తించారు. కానాజీ గూడ కు చెందిన శివానీ 26 అనే యువతి కారు డ్రైవింగ్ చేస్తుంది. 

Hyderabad: అర్ధరాత్రి కారు బీభత్సం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు .. కారునడిపిన యువతి సాప్ట్ వేర్ ఉద్యోగిగా గుర్తింపు
Hyderabad Accident
Follow us

|

Updated on: May 04, 2023 | 7:51 AM

సికింద్రాబాద్‌ అల్వాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓ యువతి అతి వేగంగా కారణంగా ముగ్గురు గాయపడగా… ఒక మృతి చెందారు. ఈ ఘటనలో ఒక బైక్‌, చెరుకు రసం బండి, టిఫిన్ సెంటర్ నడుపుకునే బండి పూర్తిగా ధ్వంసంఅయ్యాయి. అల్వాల్‌లోని మిలిటరీ డైరీ ఫారం రోడ్‌లోని సుభాష్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది.

ముందుగా ఒక వ్యక్తి ఢీ కొట్టి.. ఆ తరువాత ఓ రెండు చిన్న షాపులతోపాటు …రెండు టూ వీలర్స్..హై టేషన్‌ కరెంట్‌ స్థంభానికి కారు బలంగా తాకడంతో స్తంభం రెండు ముక్కులుగా విరిగిపోయింది. స్తంభం పక్కానే ఉన్న బైక్‌పై ఉన్న స్విగ్గి బాయ్‌కి తాకడంతో అబ్బాయి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఒక బైక్‌, చెరుకు రసం , రొట్టేల బండి పూర్తిగా ధ్వంసమయ్యాయి.

తిరుమలగిరి నుండి మిలటరీ డైరీ ఫార్మ్ వైపు ప్రయాణిస్తూ ఉండగా జరిగిన ప్రమాదం చోటు చేసుకుందిట. కారు నడిపిన యువతిని పోలీసులు గుర్తించారు. కానాజీ గూడ కు చెందిన శివానీ 26 అనే యువతి కారు డ్రైవింగ్ చేస్తుంది.  సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న శివానీ లో బిపి తో బాధపడుతున్నట్లు తెలిపారు. కారు నడుపుతున్న సమయంలో కారుకి ఎదురుగా వ్యక్తి రావడంతో అతడిని తప్పించే ప్రయత్నంలో ఎక్సలేటర్ పై యువతి కాలు పెట్టినట్లు చెప్పారు. దీంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి కారణం అయినట్లు గుర్తించారు. పోలీసులు శివానిని అదుపులో తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..