AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్‌.. ఏడున్నర గంటల్లో 578 కి.మీల జర్నీ

తాజాగా తెలంగాణలో మరో కొత్త వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, సికింద్రాబాద్‌- బెంగళూరుల మధ్య వందే భారత్‌ రైలు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు...

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్‌.. ఏడున్నర గంటల్లో 578 కి.మీల జర్నీ
Narender Vaitla
|

Updated on: Sep 09, 2024 | 6:57 PM

Share

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. అధునాతన సౌకర్యాలు, అత్యంత వేగంతో గమ్యాన్ని చేరుకునే అవకాశం లభించడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వందే భారత్ సేవలను వినియోగించుకుంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగానే దేశవ్యాప్తంగా వందే భారత్‌ సేలు విస్తరిస్తున్నాయి.

తాజాగా తెలంగాణలో మరో కొత్త వందే భారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, సికింద్రాబాద్‌- బెంగళూరుల మధ్య వందే భారత్‌ రైలు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో మరో మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌, నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్‌ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు.

సికింద్రబాద్‌ నాగ్‌పూర్‌ల మధ్య 578 కి.మీల దూరం ఉంది. వందే భారత్‌ అందుబాటులోకి రావడం ద్వారా కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

ఇక ఈ రైలు కాజీపేట, రామగుండం, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో ఆగుతుందన అధికారులు తెలిపారు. ఇక నాగ్‌పూర్‌ నుంచి ప్రస్తుతం రెండు వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ రైలుతోపాటు నాగ్‌పూర్‌- పుణె రైలు కూడా సెప్టెంబర్‌ 15న ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఈ రైలు ద్వారా తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానున్న వందే భారత్ రైళ్ల సంఖ్య నాలుగుకి చేరనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..