Musi Beautification: మూసీ బ్యూటిఫికేషన్కు ముందడుగు.. మురికి వదిలేనా..!!
ఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును, యమునా రివర్ ను సందర్శించి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు. జనవరి 3వ తేదీన మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండి ఆమ్రపాలి అహ్మదాబాద్ సందర్శించారు.

మూసీ బ్యూటిఫికేషన్పై ఉన్నతాధికారులతో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆమ్రపాలి చర్చలు మూసినది బ్యూటిఫికేషన్కు ముందడుగు పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును, యమునా రివర్ ను సందర్శించి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు.
జనవరి 3వ తేదీన మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండి ఆమ్రపాలి అహ్మదాబాద్ సందర్శించారు. శనివారం యమున ప్రాజెక్టును సందర్శించారు. ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి)లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్(డిజి) అశోక్ కుమార్ ఐఏఎస్ (తెలంగాణ క్యాడర్)తో కలిసి చర్చించారు. ఆ రెండు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల ఉన్నతాధికారులు తమ అనుభవాలను మూసీ రివర్ఫ్రంట్ కార్పొరేషన్ ఎండి అమ్రపాలికి వివరించారు.
అహ్మదాబాద్ మున్సిపల్ ఉన్నతాధికారి తెన్నరసన్, సబర్మతి రివర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్(సిఇ) జగదీష్ పటేల్, జనరల్ మేనేజర్(జిఎం) సుశాంత్ భాటియా, నమామి గంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడి) విశిష్ట, ఉన్నతాధికారులు ఎన్. కే.మదన్, పీయూష్ గుప్తా తదితరులతో మూసి రివర్ ఫ్రంట్ అధికారులు సమావేశం అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
