మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
ఇన్-సర్వీస్ టీచర్లకు ‘TET 2026’ పరీక్షల షెడ్యూల్ విడుదల.. టైమింగ్స్ ఇవే
TGTET ఇన్ సర్వీస్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మూడు సెషన్లలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24,983 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్షా కేంద్రాల పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రకటించింది..
- Vidyasagar Gunti
- Updated on: Aug 29, 2026
- 3:28 pm
హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో లక్షల విలువైన అన్కట్ డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బ్యాగ్కు ఎలాంటి డ్యామేజ్ లేకపోవడంతో ప్రయాణికులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 28, 2026
- 7:17 pm
Hyderabad: అయ్యో ఎంత పనిచేశావమ్మా.. పెళ్లై పదేళ్లైనా పిల్లలు లేరని..
పెళ్లై పదేళ్లు గడుస్తున్నా.. సంతానం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని మాదాపూర్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల సునీతా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఎంతకూ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దల కొట్టగా ఈ విషాదం వెలుగు చూసింది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 28, 2026
- 10:24 am
చనిపోయినా ముగ్గురికి పునర్జన్మ.. 18 ఏళ్ల యువకుడి అవయవ దానంతో నిలిచిన ప్రాణాలు!
మరణంలోనూ మరొకరికి జీవాన్ని ప్రసాదించి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఓ యువకుడు. రంగారెడ్డి జిల్లాలకు చెందిన బన్నీ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా కీసరగుట్ట సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బన్నీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ కారణంగా మరణించాడు.తల్లిదండ్రుల సమ్మత్తితో అతని శరీరం నుంచి 2 కిడ్నీలు, 1 లివర్ను సేకరించిన వైద్యులు వాటిని ఇతరులకు అమర్చీ ప్రాణాలు నిలబెట్టారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 25, 2026
- 7:09 pm
స్కూల్ బ్యాగేజీ.. అయ్యింది ఇక ఈజీ..: తల్లిదండ్రుల వినూత్న ఆలోచన
స్కూల్ బ్యాగ్ బరువుతో భుజాలపై ఒత్తిడి పడుతున్న చిన్నారులకు కరీంనగర్కు చెందిన ఓ విద్యార్థి తల్లిదండ్రులు సింపుల్గానే అదిరిపోయే సొల్యూషన్ చూపించారు. చిన్న ట్రాలీకి స్కూల్ బ్యాగ్ను అనుసంధానించి, పిల్లలు భుజాన బ్యాగ్ మోయాల్సిన అవసరం లేకుండా చేశారు. ఈ స్మార్ట్ ఐడియా ఇప్పుడు ఇతర పేరెంట్స్ను కూడా ఆకట్టుకుంటోంది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 25, 2026
- 12:15 pm
గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఆందోళన రేపిన ఇద్దరు చిన్నారుల అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, సమయస్ఫూర్తితో వ్యవహరించి గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. నిందితుడి బారి నుంచి ఇద్దరు పసికందులను సురక్షితంగా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 25, 2026
- 11:17 am
ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. రూ.30 లక్షల బెట్టింగ్ డబ్బుతో అడ్డంగా బుక్కైన యువకుడు
మద్యం మత్తులో సరదాగా చేసిన ఒక చిన్న ప్రాంక్ మెసేజ్ ఏకంగా పెద్ద హవాలా, క్రికెట్ బెట్టింగ్ ముఠా అసలు రంగును బయటపెట్టింది. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విచిత్ర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
- Vidyasagar Gunti
- Updated on: Aug 24, 2026
- 12:21 pm
Hyderabad: హైస్పీడ్ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శంషాబాద్ ORR పై గార్డెనింగ్ పనులు చేస్తున్న ఓ కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్నారు. ప్రమాదానికి గురైన కారును గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 21, 2026
- 2:03 pm
Hyderabad: ఎయిర్పోర్టులో స్కానింగ్ మిషన్ దాటుతుండగా మోగిన అలారం.. ఆపి చెక్ చేయగా..
ఇటీవల ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులు తీసుకొస్తున్న కొన్ని వస్తువులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రయాణికుడు బ్యాగులో కొతి పుర్రెను పెట్టుకొని రాగ.. తాజాగా ఓ ప్రయాణికుడు బుల్లెట్స్తో అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 16, 2026
- 12:36 pm
Hyderabad: ఇలాంటి కొడుకులు ఏ తల్లికి ఉండకూడదు.. కుమారులు చేసింది తట్టుకోలేక..
మనం ఎదిగే తీరు.. మన ప్రవర్తన ఎప్పుడూ మనల్ని కన్న తల్లిదండ్రులు తలెత్తుకునేలా ఉండాలి. కానీ ఇక్కడో ఇద్దరు కొడుకు మాత్రం.. వీళ్లను ఎందుకు కన్నానో అని ఆ తల్లే అనుకునేలా ప్రవర్తించారు. ఓ కొడుకు తండ్రినే పొట్టనపెట్టుకొని జైలుకు వెళ్తే.. మరో కొడుకు గంజాయికి బానిసై ఆమెపాలిట యముడిగా మారాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తల్లి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 14, 2026
- 12:25 pm
NEET Free Coaching: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. నీట్ ఉచిత లాంగ్టర్మ్ కోచింగ్కు ఇలా అప్లై చేసుకోండి..
డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది. NEET–2027 కోసం ఉచిత లాంగ్టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్లోని చిలుకూరు TGSWR ఫౌండేషన్ COEలో బాలురకు, మహేంద్రహిల్స్ ఫౌండేషన్ COEలో బాలికలకు కలిపి మొత్తం 200 సీట్లను కేటాయించారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 12, 2026
- 6:26 pm
మైనర్ బాలికను చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పునిచ్చిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు!
నేరానికి ఒడిగడితే చట్టం ఉక్కుపాదం మోపుతుందనడానికి ఈ తీర్పు మరొక ప్రబల నిదర్శనం. బాలికలపై జరిగే అకృత్యాలు, వేధింపుల పట్ల న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో హైదరాబాద్ మహానగరంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు స్పష్టం చేస్తోంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ నేరెడ్మెట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 12, 2026
- 6:17 pm