మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్ రిజల్ట్స్.. సింపుల్గా ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Apr 28, 2026
- 9:01 pm
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఫీట్ పిక్స్తో లక్షల్లో సంపాదన! ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా?
నేటి డిజిటల్ యుగంలో డబ్బు సంపాదించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. అయితే కేవలం మీ కాళ్ల ఫోటోలు అమ్మి నెలకు లక్షల్లో సంపాదించొచ్చు అంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా, విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ 'ఫీట్ పిక్' బిజినెస్ ఇప్పుడు భారత్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? ఇందులో ఉన్న రిస్క్ ఏంటి? మన దేశ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం పదండి.
- Vidyasagar Gunti
- Updated on: Apr 16, 2026
- 3:08 pm
DOST 2026: ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. ఇదిగో పూర్తి షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ - DOST 2026-27 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం దోస్త్ 2026-27 షెడ్యూల్ను ప్రకటించారు.
- Vidyasagar Gunti
- Updated on: Apr 13, 2026
- 1:25 pm
TG TET 2026: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?
తెలంగాణలోని లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. విద్యాశాఖ TG TET జూన్-2026 నోటిఫికేషన్ను విడుదల చేస్తూ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. మంగళవారం నుండే పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుండగా ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల గురించిం ఇప్పుడు తెలుసుకుందాం..
- Vidyasagar Gunti
- Updated on: Apr 13, 2026
- 12:57 pm
Telangana Inter Results: అఫీషియల్ వచ్చేసింది.! ఇంటర్ ఫలితాలు రేపే.. ఒక్క క్లిక్తో రిజల్ట్స్ చూసేయండి
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 వార్షిక పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 12) విడుదల చేయనుంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తేలనుండగా, ఈసారి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లతో పాటు టీవీ9 తెలుగు సైట్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా చూసుకునే వెసులుబాటు ఉంది.
- Vidyasagar Gunti
- Updated on: Apr 12, 2026
- 8:42 am
టూరిజంలో సరికొత్త ట్రెండ్.. తమిళనాడు వెళ్లే టూరిస్ట్లు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే
తమిళనాడు పర్యటనకు వెళ్లే టూరిస్ట్లకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి.ఎందుకంటే చెట్టినాడు ఇప్పుడు సంప్రదాయ భవనాలను చూసే సాధారణ పర్యాటకం నుండి మారిన కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. కేవలం భవనాలను చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా, పర్యాటకులు అక్కడి వారసత్వంతో మమేకం కావాలనే లక్ష్యంతో సరికొత్త విధానాన్ని రూపొందించిం. అదేంటో చూద్దాం పదండి.
- Vidyasagar Gunti
- Updated on: Apr 10, 2026
- 3:28 pm
వ్యాయామం ఆరోగ్యానికేనా..? వ్యసనంగా మారుతుందా..? ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్నెస్పై అవగాహన పెరగడం శుభపరిణామమే..! అయితే ఆరోగ్యం కోసం చేసే వ్యాయామం క్రమంగా అడిక్షన్గా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లడం మంచిదే కానీ, అది ఒక వ్యసనంగా మారినప్పుడు శారీరక ప్రయోజనాల కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
- Vidyasagar Gunti
- Updated on: Apr 8, 2026
- 6:46 pm
TGCET 2026 Results: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల తొలి జాబితా ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
TGCET 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి VI నుంచి IX తరగతుల వరకు బ్యాక్లాగ్ ఖాళీల భర్తీతో పాటు TGTWREIS స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి (బాలికలు), ఖమ్మం (బాలురు)లో VIII తరగతి ప్రవేశాలకు..
- Vidyasagar Gunti
- Updated on: Apr 7, 2026
- 5:44 pm
మ్యారేజ్ మార్కెట్లో న్యూ ట్రెండ్.. కొత్త విధానంలో పాట్నర్స్ను వెతుక్కుంటున్న యువత!
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు.. మ్యాట్రిమోనీ సైట్లు, బ్రోకర్ల హడావుడి మామూలుగా ఉండదు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కేవలం ఫోటోలు చూసి జాతకాలు కలిపి పెళ్లిళ్లు చేసుకునే రోజులు పోతున్నాయి. ఆధునిక యువత తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో సరికొత్త దారిని వెతుక్కుంటున్నారు. అదేంటో చూద్దాం పదండి.
- Vidyasagar Gunti
- Updated on: Apr 7, 2026
- 2:01 pm
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు.. రిజల్ట్స్ వచ్చేది అప్పుడే..
పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి. ఫలితాల విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ వారం కాకుండా, వచ్చే వారం ఏప్రిల్ 12-15 మధ్య తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఆధారంగా అధికారిక తేదీని త్వరలో ప్రకటించనున్నారు అధికారులు.
- Vidyasagar Gunti
- Updated on: Apr 7, 2026
- 11:59 am
పాస్పోర్ట్ అక్కర్లేదు.. వీసా అసలే వద్దు! విదేశీ టూర్ వెళ్లాలనుందా?
వీసా, పాస్పోర్ట్ లేకుండానే మరో దేశంలోకి అడుగుపెట్టే అవకాశం భారతదేశంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్లోని జైగావ్ నుంచి కేవలం ఒక గేట్ దాటితే భూటాన్లోని ఫుయెంట్షోలింగ్ చేరవచ్చు. తక్కువ ఖర్చుతో విదేశీ అనుభూతిని అందించే ఈ సరిహద్దు పట్టణం పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
- Vidyasagar Gunti
- Updated on: Apr 2, 2026
- 9:22 pm
Viral News: బ్రతికుండగానే చావు భయం.. దీన్ని జయిస్తే ఇక మీకు తిరుగులేనట్టే.. ఏంటో తెలుసా?
మీరు బ్రతికి ఉండగానే.. మిమ్మల్ని ఒక చీకటి గదిలో సెవపేటికలో పెట్టి మూసేస్తే.. అప్పుడు మీకేమనిపిస్తుంది. ఒక్కసారిగా ఊరిరాడిపోయిన అనుభవం కలుగుంది. చావు భయం ఒక్కక్షణం మన కళ్లముందు కనిపిస్తోంది. వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటకురావాలి అనిపిస్తోంది కదా.. కానీ ఇదే ఇప్పుడు జపాన్లో ట్రెండ్గా కొనసాగుతుంది. అక్కడి ప్రజలు బతికుండగానే ఆ శవపేటికలో పడుకుని, మరణాన్ని అనుభవపూర్వకంగా చూడాలనుకుంటున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Apr 2, 2026
- 2:59 pm