మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
Hyderabad: ఒకరి సరదా.. మరొకరి ప్రాణం.. షేక్పేట్ యాక్సిడెంట్ దర్యాప్తులో సంచలన విషయాలు
ఒకరి సరదా.. మరొకరి జవితాన్నే తలక్రిందుల చేసింది. సరదాగా ఇంట్లో నుంచి కారు తీసిన ఓ బాలుడు.. ఏకంగా ఫ్యామిలీ జీవితాన్నే మార్చేశాడు. నియంత్రించలేని వేగంతో కారు నడిపి రోడ్డుపై వెళ్తున్న ముగ్గురి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారు. హైదరాబాద్లోని షేక్ఫేట్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
- Vidyasagar Gunti
- Updated on: Aug 7, 2026
- 5:14 pm
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్కు యత్నం!
రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అంతర్గత విచారణను ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది..
- Vidyasagar Gunti
- Updated on: Aug 7, 2026
- 6:00 am
Hyderabad: కాలేజీ మహిళా ప్రిన్సిపాల్తో అడ్మిన్ HR సుబ్బారెడ్డి కామలీలలు
కాలేజీలోనే రాసలీలలకు తెరతీశారు ఓ ప్రిన్సిపల్, HR అడ్మిన్. ఏకంగా CC కెమెరాల ముందే వీళ్ల సరసాలు, అతి చేష్టలు చూడ్డానికే వికారం వచ్చేలా ఉన్నాయ్..! మియాపూర్లోని 'గ్లోబల్ కస్తూర్బా కాలేజీ ఆఫ్ నర్సింగ్'లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మహిళా ప్రిన్సిపాల్తో, అడ్మిన్ HR లీలల విషయం తెలిసి విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి..
- Vidyasagar Gunti
- Updated on: Aug 6, 2026
- 5:43 pm
సాఫ్ట్వేర్ క్రేజ్ తగ్గిందా..? BA, BCom కోర్సుల వైపు విద్యార్థుల పరుగులు! మారిన కెరీర్ ట్రెండ్స్
రాష్ట్ర డిగ్రీ అడ్మిషన్లలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఇంజినీరింగ్ వైపు పరుగులు తీసిన విద్యార్థులు ఇప్పుడు బీఏ, బీకాం కోర్సులను ఎంచుకుంటున్నారు. కామర్స్, ఆర్ట్స్ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరగగా, సివిల్స్, కార్పొరేట్ ఉద్యోగాలు, ఏఐ ప్రభావం, హ్యూమన్ స్కిల్స్కు పెరుగుతున్న ప్రాధాన్యత వంటి అంశాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు..
- Vidyasagar Gunti
- Updated on: Aug 5, 2026
- 3:16 pm
ఎయిర్ పోర్టును తలదన్నేలుక్తో సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ అందాలు.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కాల్సిందే!
Secunderabad Railway Station Redevelopment latest Photos: హైదరాబాద్ నుంచి దేశంలోని నలుమూలకు ప్రయణించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. అమృత్ భారత్ పథకంలో భాగంగా హైదరాబాద్లోనే అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తగా ఎయిర్పోర్టు స్టైల్లో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి కాగా.. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మరీ ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో చూద్దాం పదండి.
- Vidyasagar Gunti
- Updated on: Aug 5, 2026
- 11:13 am
Hyderabad: అపార్ట్మెంటుల్లో లిఫ్ట్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజరే..
హైదరాబాద్లో మరో లిప్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వల్ల ఒక మహిళ మృతి చెందింది. లిఫ్ట్ ఫ్లోర్కు రాకముందే తలుపులు తెరుచుకోవడంతో మహిళ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో లిఫ్ట్ వాడేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 4, 2026
- 7:23 pm
Hyderabad : నగరంలో వెలుగులోకి మరో భారీ మోసం.. మీరు డబ్బులు పొగొట్టుకోవొద్దంటే ఇది తెలుసుకోండి!
హైదరాబాద్లో మరోసారి భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో ఇద్దరు దంపతులు ఏకంగా రూ.5కోట్లు కాజేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నెమోదు చేసుకన్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తమకు ఎలాగైన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Aug 2, 2026
- 3:04 pm
Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
ఈజీ మనీకి అలవాటు పడిన చాలా మంది కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఇలానే అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.33లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Jul 31, 2026
- 11:01 am
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి!
రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక సూచనలు జారీ చేసింది. పిల్లలను కాలేజ్లలో చేర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. గుర్తింపు లేని, అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.అడ్మిషన్ పొందే ముందే సదరు కళాశాలకు బోర్డు అఫిలియేషన్ (గుర్తింపు) ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించింది
- Vidyasagar Gunti
- Updated on: Jul 31, 2026
- 7:00 am
Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు 9 నెలలు కని పెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. వయసు మళ్లిన పేరెంట్స్ను పట్టించుకోకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలానే తన తల్లిదండ్రులను ఇబ్బందుకలు గురిచేసే ఓ కొడుకుకు నంద్యాల జిల్లా కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అతనికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రులను కష్టపెట్టేవారికి, సమాజంలో అశాంతిని సృష్టించేవారికి చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తీర్పు ద్వారా సమాజానికి స్పష్టమైన సందేశం అందింది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 30, 2026
- 3:59 pm
Hyderabad: షేపెంట్స్ లేరు.. సైరన్ వేసుకుని స్పీడ్గా వెళ్తున్న అంబులెన్స్.. ఆపి చెక్ చేస్తే షాక్!
ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర వాహనమైన అంబులెన్స్ స్టీరింగ్, ఒక తాగుబోతు చేతికి చిక్కింది. మద్యం మత్తులో మైకం కమ్మేసినా బాధ్యతారహితంగా అంబులెన్స్ను రోడ్డుపైకి తీసుకొచ్చిన ఓ డ్రైవర్ రాయదుర్గం పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి ఆల్ సబా హోటల్ సమీపంలో పోలీసులు బుధవారం (జూలై 29) రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు.
- Vidyasagar Gunti
- Updated on: Jul 30, 2026
- 1:38 pm
ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!
ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ (తెలంగాణ ప్రవేశాలు, రుసుముల క్రమబద్ధీకరణ కమిటీ) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎన్బీఏ ఫీజు, కెరీర్ డెవలప్మెంట్ ఫీజు వంటి పేర్లతో విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా దానిని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణిస్తామని టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది..
- Vidyasagar Gunti
- Updated on: Jul 28, 2026
- 7:05 pm