తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఆదివారం(సెప్టెంబర్ 1) ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో భారీ వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.