మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
హైదరాబాద్లో కలకలం.. మత్తు కోసం కల్లులో ఏం కలుపుతారో తెలుసా..? వామ్మో యమ డేంజర్
వాస్తవానికి కల్లు అనగానే పల్లెటూళ్లు గుర్తుకొస్తాయి. తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లు ప్రజలు తాగి ఆస్వాదిస్తుంటారు, కల్లుతాగితే మంచిదని కూడా కొంతమంది చెబుతుంటారు. పల్లెల్లో సరే.. పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చిన వారి కోసం నగరాల్లో కల్లు కాంపౌండ్లు వెలిశాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కల్లు సేకరించి ఆయా ప్రాంతాల్లో విక్రయిస్తారు.
- Vidyasagar Gunti
- Updated on: Jul 9, 2025
- 6:19 pm
Govt Schools: కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు వచ్చేస్తున్నాయ్..! ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్నచోట ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో ఈ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 571 పాఠశాలలు ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..
- Vidyasagar Gunti
- Updated on: Jul 8, 2025
- 12:07 pm
TS ICET Results 2025: తెలంగాణ ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రా అబ్బాయి సత్తా.. రిజల్ట్స్ను డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకోండి..
TG ICET Results 2025: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం రాసిన ఐసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి సోమవారం విడుదల చేసింది. జూన్ 8, 9 తేదీల్లో జరిగిన ఐసెట్ ప్రవేశ పరీక్షకు 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. పరీక్ష రాసిన వారిలో 58,985 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ ఉత్తీర్ణత శాతం 90.83 నమోదైనట్లు హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 7, 2025
- 5:25 pm
Birthday Gift: కేంద్ర మంత్రి బర్త్డే.. టెన్త్ విద్యార్థిని, విద్యార్థులకు అదిరిపోయే కానుక
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని టెన్త్ క్లాస్ చదవుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అదిరిపోయే బర్త్డే కానుక ఇవ్వనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల్లోని టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులకు సైకిళ్లను అందజేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల రవాణా కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
- Vidyasagar Gunti
- Updated on: Jul 4, 2025
- 9:05 pm
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన టెన్త్ సప్లి ఎగ్జామ్ పేపర్స్ ను జూన్ 14 నుంచి 16 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 27, 2025
- 3:29 pm
TG EAPCET: ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇదిగో..!
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఎప్ సెట్ రాసి ర్యాంకులతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 27, 2025
- 3:00 pm
TG LAWCET: తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాల డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ఈ ఫలితాలను విడదల చేయనుంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల చేసిన అధికారులు..బుధవారం పూర్తి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ నెల 6న జరిగిన లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు 45 వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 24, 2025
- 6:34 pm
ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ - తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 19, 2025
- 3:13 pm
Navodaya Vidyalayas: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!
తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జూలై 15 నాటికి అన్ని నవోదయా విద్యాలయాలను ప్రారంభించి క్లాసులు మొదలుపెట్టేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 16, 2025
- 11:54 pm
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!
రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతం చేసే దిశకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ మేరకు మొదటగా రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Jun 16, 2025
- 5:49 pm
Telangana: త్వరలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు.. నిజమేనా..?
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జూలై నెల మొదటి వారంలో కౌన్సిలింగ్ ఉంటుందని ఇప్పటికే ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపు చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫీజుల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచాయి. దీనిపై సర్కారు ఏ విధంగా స్పందింస్తుందనేది ఉత్కంఠగా మారింది.
- Vidyasagar Gunti
- Updated on: Jun 15, 2025
- 2:45 pm
School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్కు విద్యాశాఖ గ్రాండ్ వెల్కమ్! భలేగా ముస్తాబైన సర్కార్ స్కూళ్లు
విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ..
- Vidyasagar Gunti
- Updated on: Jun 12, 2025
- 7:30 am