మీడియాలో రిపోర్టర్ గా పదేళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి టీవీ9లో పని చేస్తున్నాను. అంతకుమందు ఈటీవీ లో రిపోర్టర్ గా దేశ రాజధాని ఢిల్లీలో పని చేశాను. జాతీయ రాజకీయాలు, సుప్రీంకోర్టు లీగల్ అంశాలపై నాలుగేళ్లు ఢిల్లీలో కవరేజ్ చేశాను. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీలో రైతుల ఆందోళనపై నాన్ స్టాప్ కవరేజ్, హైదరాబాద్ లో వరదలపై ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేసిన ప్రత్యేకతలు ఉన్నాయి. టీవీ9 కంటే ముందు ఈటీవీ-ఢిల్లీ, భారత్ టుడే, స్టూడియో-ఎన్ న్యూస్ ఛానెల్స్ లో పని చేసిన అనభువం ఉంది. ప్రస్తుతంలో తెలంగాణలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా కొనసాగుతూ.. అదనంగా విద్యారంగ, సామాజిక, సాంకేతిక అంశాలపై కవరేజ్ అందిస్తున్నాను. ప్రస్తుతం రాజకీయంగా బీజేపీ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, జనసేన, తెలంగాణ జనసమితి పార్టీల బీట్ రిపోర్టర్ గా కవరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో ఆయా పార్టీల పూర్తి వార్తలను హైదరాబాద్ స్టేట్ బ్యూరో నుంచి కవర్ చేస్తున్నారు. దానితోపాటు తెలంగాణ విద్యాశాఖను కూడా చూస్తున్నాను. విద్య, ఉద్యోగ అప్ డేట్స్ పాటు ఆ రంగాల్లో సమస్యల వార్తల కవరేజ్ చేస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ తో టీవీ9 ద్వారా రాజకీయ, సామాజిక అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాను.
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
- Vidyasagar Gunti
- Updated on: Mar 12, 2026
- 2:03 pm
Telangana SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: ఈసారి కొత్త రూల్స్ ఇవే!
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు హాల్ టికెట్లపై QR కోడ్, వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ వంటి సరికొత్త సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
- Vidyasagar Gunti
- Updated on: Mar 12, 2026
- 11:56 am
ఆ దేశానికి క్యూ కడుతున్న యువత.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..
నేటి యువత పర్యాటకాన్ని విరామంగా కాకుండా, సరికొత్త జీవన అనుభవంగా చూస్తున్నారు. కమ్యూనిటీ ట్రావెల్ వైపు మొగ్గు చూపుతూ, స్థానిక సంస్కృతిని అనుభవించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం తక్కువ బడ్జెట్, సులభమైన వీసా, అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చే కంట్రీస్కు వెళ్లేందుకు ఎక్కవుగా ఇష్టపడుతున్నారు. అందుకే లగ్జరీ కంటే లెర్నింగ్కు ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ మంది వియత్నాం వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
- Vidyasagar Gunti
- Updated on: Mar 9, 2026
- 5:53 pm
Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్లో మంజీరా ఫేజ్-3 వ్యవస్థలో మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. పెద్దాపూర్ పంప్ హౌస్లో పాత హెచ్టీక్ ప్యానెల్స్ మార్పిడి, పైప్లైన్ మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీరు అందనుంది.
- Vidyasagar Gunti
- Updated on: Mar 6, 2026
- 9:17 pm
New Technology: ఇది నోట్లో వేసుకుంటే పాటలు వినిపిస్తాయి.. అదరగొడుతున్న కొత్త టెక్నాలజీ! ఇది నిజంగా కొత్తదేనా?
New Technology: CES షోకి వచ్చిన సందర్శకులు ఈ లాలీపాప్ను నోట్లో పెట్టుకుని, తమ తల లోపల వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యూజికల్ లాలీపాప్ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి..
- Vidyasagar Gunti
- Updated on: Mar 6, 2026
- 3:38 pm
Kishan Reddy: ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు అడ్డంకులు తొలగించండి: సీఎంకు కేంద్రమంత్రి లేఖ
నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకుల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
- Vidyasagar Gunti
- Updated on: Mar 6, 2026
- 12:50 pm
Telangana: టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. వాట్సాప్ నుంచే హాల్టికెట్స్.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే?
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామ్స్-2026 షెడ్యూల్ను తో పాటు హాల్ టికెట్ సమాచారాన్ని అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి వాటిని ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
- Vidyasagar Gunti
- Updated on: Mar 5, 2026
- 11:23 am
Holi Color Removal: హోలీ రంగులు వదలట్లేదా?.. ఈ సింపుల్ చిట్కాలతో చిటికెలో వదిలించుకోండి
రంగుల పండుగ హోలీ వచ్చేసింది. స్నేహితులు, బంధువులతో కలిసి రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేయడం అందరికీ ఇష్టమే. అయితే సంబరాలు పూర్తయ్యాక చర్మంపై, గోళ్లపై అంటుకున్న ఆ మొండి రంగులను వదిలించుకోవడం పెద్ద ప్రహసనంగా మారుతుంది. రసాయనాలతో కూడిన రంగుల వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే చర్మానికి ఎటువంటి హాని కలగకుండా హోలీ రంగులను సులభంగా ఎలా వదిలించుకోవాలో ఈ చిట్కాల ద్వారా తెలుసుకోండి.
- Vidyasagar Gunti
- Updated on: Mar 3, 2026
- 1:57 pm
Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
ఆధ్యాత్మిక లోకంలో ఒక శకం ముగిసింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ధీశాలి డాక్టర్ ఎం.వి. సౌందర రాజన్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మిక వాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
- Vidyasagar Gunti
- Updated on: Feb 27, 2026
- 4:04 pm
Telangana: వచ్చే ఏడాది నుంచే కొత్త స్కూల్స్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ రాష్ట్ర విద్యా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది రేవంత్ సర్కార్. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాఠశాలల్లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు పూర్తిస్థాయి విద్య అందుబాటులోకి రానుంది.
- Vidyasagar Gunti
- Updated on: Feb 26, 2026
- 8:49 pm
TG PECET 2026: పీఈటీ అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?
క్రీడలనే కెరీర్గా మలచుకోవాలనుకునే యువతకు, వ్యాయామ విద్యలో రాణించాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని B.P.Ed, D.P.Ed కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG PECET- 2026 నోటిఫికేషన్ విడుదలైంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ను నిర్వహించనుంది.
- Vidyasagar Gunti
- Updated on: Feb 24, 2026
- 4:48 pm
Honeymoon: హనీమూన్కు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారా?.. కపుల్స్ ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!
అంతర్జాతీయ ప్రయాణం అంటేనే ఒక కొత్త అనుభూతి. అది కూడా పెళ్లైన కొత్తలో లేదా భాగస్వామితో కలిసి వెళ్లే మొదటి విదేశీ పర్యటన అయితే ఆ మజానే వేరు. అయితే సరైన ప్లానింగ్ లేకపోతే ఈ అందమైన ప్రయాణం కాస్త ఒత్తిడితో కూడుకున్నదిగా మారే ప్రమాదం ఉంది. మీ మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
- Vidyasagar Gunti
- Updated on: Feb 23, 2026
- 3:47 pm