అమ్మతనానికే మచ్చ.. తన సుఖం కోసం కన్నబిడ్డను బలి తీసుకున్న కసాయి తల్లి!
హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగుచూసిన ఆరేళ్ల బాలిక తన్విక మృతి కేసు యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని పోలీసులు వెలికితీశారు. తన స్వార్థం కోసం, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో కన్నతల్లే కాలయమురాలిగా మారి కూతురిని కడతేర్చిన వైనం అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఉంది.

హైదరాబాద్లోని అల్వాల్లో వెలుగుచూసిన ఆరేళ్ల బాలిక తన్విక మృతి కేసు యావత్ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన ఈ ఘటన వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని పోలీసులు వెలికితీశారు. తన స్వార్థం కోసం, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో కన్నతల్లే కాలయమురాలిగా మారి కూతురిని కడతేర్చిన వైనం అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఉంది.
అల్వాల్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో నివసించే శ్వేతకు ఆరేళ్ల కూతురు తన్విక ఉంది. గతంలో భర్తతో విడాకులు తీసుకున్న శ్వేత, మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, రెండు రోజుల క్రితం తన్విక ఇంట్లో కనిపించకుండా పోయింది. కాసేపటికే ఇంటి ఆవరణలోని నీటి సంపులో బాలిక శవమై తేలింది. ఆ సమయంలో శ్వేత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, తన కూతురు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయిందని అందరినీ నమ్మించింది.
స్థానికులు, బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, శ్వేత ప్రవర్తనలో తేడాలను గమనించిన పోలీసులు ఆమెను గట్టిగా విచారించారు. పోలీసుల విచారణలో శ్వేత చెప్పిన నిజాలు విని అధికారులు సైతం నివ్వెరపోయారు. తన ప్రియుడితో కలిసి ఉండటానికి కూతురు అడ్డుగా ఉందని శ్వేత భావించింది. ఆడుకుంటున్న బాలికను పట్టుకుని బలవంతంగా సంపులోకి తోసేసింది. అంతటితో ఆగకుండా, చిన్నారి బయటకు రాకుండా సంపుపై ఉన్న భారీ మూతను బిగించేసింది. పాప చనిపోయిందని నిర్ధారించుకున్నాక, ఏమీ తెలియనట్టు నటిస్తూ పాప కనిపించడం లేదని గగ్గోలు పెట్టిందని పోలీసుల విచారణలో తేలింది.
కన్నకూతురిని చంపడానికి మనసు ఎలా ఒప్పిందంటూ స్థానికులు శ్వేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన తల్లే ఇంతటి ఘాతుకానికి పాల్పడటం నమ్మలేకపోతున్నాం అని కన్నీరు పెడుతున్నారు. ప్రస్తుతం నిందితురాలు శ్వేతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కసాయి తల్లికి కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్వ్యాజ్యమైన ప్రేమకు నిలువుటద్దం లాంటి అమ్మ మనసు, వావివరసలు మరిచిన అక్రమ సంబంధం వల్ల ఎంతటి క్రూరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
