AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ ఫైనల్ వార్నింగ్..!

ఉదయం నుంచి సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించమని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదన్నారు.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బస్సు సర్వీసులను నడిపే యోచనలో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం […]

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ ఫైనల్ వార్నింగ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 05, 2019 | 4:15 PM

Share

ఉదయం నుంచి సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పువ్వాడ అజయ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలలోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించమని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదన్నారు.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బస్సు సర్వీసులను నడిపే యోచనలో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నది. 1. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం. 2. ఆర్టీసీ బస్సులు నడపడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హుత గల వారికి తక్షణం తగిన శిక్షణ ఇచ్చి.. బస్సులను యధావిధిగా నడపడం. 3. ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం.

శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని గమనించిన తర్వాత.. ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగానే మంత్రి పై ప్రకటన విడుదల చేశారు.