Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Malla Reddy: కుమారుడిని డాక్టర్‌ చేస్తే.. కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్‌గా.. రెడ్డి అమ్మాయిని చేస్తే.. కిట్టీ పార్టీలు, పిక్నిక్‌లంటూ తిరిగేది..

కొడుకును డాక్టర్‌ను చడివిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్‌గా వచ్చిందని.. రెడ్డి అమ్మాయిని కొడుకుకి చేసుంటే కిట్టి పార్టీలు… పిక్నిక్ లు వెళ్ళేదన్నారు. నా కోడలుకు అమ్మ నాన్న లేరు.. నాకు కోడలు మూడో కొడుకు లాగా అని ఎమోషనల్‌ అయ్యారు.

Minister Malla Reddy: కుమారుడిని డాక్టర్‌ చేస్తే.. కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్‌గా.. రెడ్డి అమ్మాయిని చేస్తే.. కిట్టీ పార్టీలు, పిక్నిక్‌లంటూ తిరిగేది..
Minister Malla Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 05, 2022 | 1:28 PM

మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడిని డాక్టర్‌ చేస్తే..నాకు డాక్టర్‌ కోడలు గిఫ్ట్‌గా వచ్చిందన్నారు. అదే నా కుమారుడికి రెడ్డి అమ్మాయిని చేస్తే..కిట్టీ పార్టీలు, పిక్నిక్‌లు అంటూ తిరిగేదంటూ చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. ఓ కాలేజీ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ.. బర్త్ డే లు పిక్నిక్స్ ఉండొద్దని.. పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని ఫైర్‌ అయ్యారు. కొన్నింటి సాధించాలంటే కొన్నింటికి దూరం ఉండాలన్నారు. ప్రేమ, ఫ్రెండ్షిప్ అన్నిటికీ దూరం ఉండాలని.. నేను ఏది దాచుకోనన్నారు మంత్రి మల్లారెడ్డి. భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చదవించానని.. ఎంపీ…ఎమ్మెల్యే.. మంత్రి అయ్యానన్నారు. నాకు ఎలాంటి కోరికలు లేవన్నారు.

కొడుకును డాక్టర్‌ను చడివిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్‌గా వచ్చిందని.. రెడ్డి అమ్మాయిని కొడుకుకి చేసుంటే కిట్టి పార్టీలు… పిక్నిక్ లు వెళ్ళేదన్నారు. నా కోడలుకు అమ్మ నాన్న లేరు.. నాకు కోడలు మూడో కొడుకు లాగా అని ఎమోషనల్‌ అయ్యారు మంత్రి మల్లారెడ్డి.

అయితే తన దగ్గర ఏం దొరక్క ఐటీ అధికారులు నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనది ఓపెన్ హార్ట్ అని.. మనసులో ఏం దాచుకోనని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో అంతా ఆన్ లైన్‌లోనే సిస్టమ్ నడుస్తోందని.. తామెక్కడా డొనేషన్లు వసూళ్లు చేయలేదన్నారు. మొన్న తన ఇంట్లో ఐటీ రైడ్స్ చేశారని… లెక్కలన్నీ క్లియర్‌గా ఉన్నాయని మల్లారెడ్డి పేర్కొన్నారు. 400 మంది ఐటి అధికారులతో దాడులు చేశారన్నారు. వారంతా తన దగ్గర ఏం దొరక్క నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని తెలిపారు. తానేం తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడవల్సిన అవసరం తనకు లేని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం