Telangana: ఈ నియోజకవర్గంలో బీజేపీకి షాక్.. హస్తం గూటికి కీలక నేత
ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు వర్క్ అవుట్ కావడం లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీ గెలవాలని విశ్వప్రయత్నం చేస్తుంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ పార్టీ నేతలు షాక్కి గురైయ్యారు.
ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు వర్క్ అవుట్ కావడం లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీ గెలవాలని విశ్వప్రయత్నం చేస్తుంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ పార్టీ నేతలు షాక్కి గురైయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్న పులి మామిడి రాజు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి.. హస్తం గూటికి చేరారు. పులిమామిడి రాజు శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
సంగారెడ్డి బీజేపీ పార్టీ ఇంచార్జ్గా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్లో చేరడంతో సంగారెడ్డి సెగ్మెంట్తో పాటు జిల్లాలో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతుంది అని, ఆ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. మరో వైపు బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి పులిమామిడి రాజు.. సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా పేరుంది. రాజు ఆ పార్టీని వీడడం బీజేపీకి నష్టమే అని అంటున్నారు సీనియర్ లీడర్లు. పులిమామిడి రాజు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ఎవరు ఉహించలేదంటున్నారు. ఇంత సడన్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. పులిమామిడి రాజు సొంత ఊరు సంగారెడ్డి జిల్లా సదశివపేట శనివారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉదయం సదశివపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అదే రోజు పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో రాజు ఇంట్లోనే ఉదయం రఘునందన్ రావుకి టిఫిన్ ఏర్పాట్లు ఉన్నాయని బీజేపీ నేతలు రఘునందన్కి చెప్పారు.
రఘునందన్ ఉదయం ప్రచారం ముగించుకొని పులిమామిడి రాజు ఇంటికి బయలుదేరగా అప్పటికే పులిమామిడి రాజు అందుబాటులో లేరు. కట్ చేస్తే అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్లో చేరడం అనేది బీజేపీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజు.. ఆ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదు అని, బీజేపీ పార్టీలో చేరి సంగారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓడిపోయారు. రాజుకు మొన్న జరిగిన ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చాయి. గతంలో ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులకు 16,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులిమామిడి రాజు బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే అతన్ని ఇబ్బందులకు గురి చేశారు అని సమాచారం. తర్వాత కొద్దిరోజులు పార్టీలో క్రియాశీలంగానే పనిచేసిన కూడా పార్టీలో కొంతమంది నేతల తీరు మరలేదట. అందుకే గత కొద్దిరోజులుగా పులిమామిడి రాజు పార్టీ కార్యక్రమాలకు ఆంటి ముట్టనట్లుగ వ్యవహరి స్తున్నారని సమాచారం. అందుకే ఆయన పార్టీని వీడి ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడైన రాజు ఆ పార్టీని వీడడం నష్టమే అనే చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇంకా ఎవరెవరు పార్టీని వీడుతారు అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..