AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manda Jagannadham: పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయవతి..!

పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్నారు బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయవతి. మొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. నిన్న మంద జగన్నాథం ఇద్దరూ బలై పోయారు. మరీ ముఖ్యంగా జగన్నాథం విషయంలో బీఫామ్‌.. వేరొకరికి ఇచ్చి షాక్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, బీఎస్పీ నేత మంద జగన్నాథం పరిస్థితి ఎటుకాకుండా పోయింది.

Manda Jagannadham: పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయవతి..!
Manda Jagannadham
Balaraju Goud
|

Updated on: Apr 27, 2024 | 8:43 AM

Share

పార్టీలో చేరిన ప్రతీ నేతకు ఝలక్ ఇస్తున్నారు బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయవతి. మొన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. నిన్న మంద జగన్నాథం ఇద్దరూ బలై పోయారు. మరీ ముఖ్యంగా జగన్నాథం విషయంలో బీఫామ్‌.. వేరొకరికి ఇచ్చి షాక్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ ఎంపీ, బీఎస్పీ నేత మంద జగన్నాథం పరిస్థితి ఎటుకాకుండా పోయింది.

నాగర్ కర్నూల్ నుంచి ఈ సారి ఎంపీగా పోటీ చేయాలన్న ఆయన ఆశ అడిఆశలుగానే మిగిలాయి. జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీ చేయలేని పరిస్థితి తలెత్తింది. పదిరోజుల క్రితమే బీఎస్పీలో చేరిన ఆయన నాగర్ కర్నూల్ నుంచి బహుజన సమాజ్ పార్టీ తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తీరా రెండో సెట్ నామినేషన్‌ సమయానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి నుంచి బీఫామ్‌ అందలేదు. దీంతో నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు మంద జగన్నాథం నామినేషన్‌ను ఈసీ అధికారులు తిరసస్కరించారు.

అయితే బీఎస్పీ నుంచి బీ ఫామ్ యూసుఫ్ అనే వ్యక్తికి ఇవ్వడంతో జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం కూడా ఆయనకు లేకుండా పోయింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుండాలంటే కనీసం 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ మంద జగన్నాథం నామినేషన్‌లో 5 మంది ఓటర్లు మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా పోటీలో వుండే అవకాశాన్ని ఆయన కోల్పోయారు.

ఇదిలా ఉంటే నాగర్ కర్నూలుకు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ విషయంలోను ఝలక్ ఇచ్చింది మాయవతి. బీఎస్పీకి తెలంగాణలో భుజానికి ఎత్తుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి అడుగడునా షాక్‌లు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తుకు కేసీఆర్ ను సిద్ధం చేశాక వెనక్కి తగ్గారు. దీంతో ఏంచేయాలో తోచని పరిస్థితులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అదేంటో గాని నాగర్‌ కర్నూల్‌కి చెందిన అటు మంద జగన్నాథం, ఇటు ప్రవీణ్ కుమార్ విషయంలో బెహన్జీ విచిత్రంగా ప్రవర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..