Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్.. ఎక్కడెక్కడంటే
హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో పటాన్ చెరు నుంచి హైదర్నగర్ వరకు పైప్లైన్కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు తేది: 01.11.2023, బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు(02.11.2023) గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
ఈ విషయాన్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత.. నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి.. నీటిని ముందుగానే నిల్వ చేసుకుంటే ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతరాయం ఏర్పడు ప్రాంతాలు..
- ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా).
- ఓ అండ్ ఎం డివిజన్ – 8 : హఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.
- ఓ అండ్ ఎం డివిజన్ – 9 : కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
- ఓ అండ్ ఎం డివిజన్ – 15 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్.
- ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం.
పైన పేర్కొన్న నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ జలమండలి అధికారులు సూచించారు. అలాగే ముందుగానే నీటిని నిల్వ ఉంచుకోవాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
