AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్‌పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు.

Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..
Vande Bharat Express
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 6:16 PM

Share

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్‌పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు. గతేడాది 2835 కేసులు నమోదైనా, ఈ సంవత్సరం 2607 కేసులకు తగ్గాయి. 500 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. 629 మంది ప్రమాదాల్లో, 529 మంది ఆత్మహత్యలతో మొత్తం 1317 మంది మరణించారు.

NDPS యాక్ట్ కింద 54 కేసులు,70 అరెస్టులు, 817 కేజీల డ్రై గంజా సీజ్ చేసినట్లు తెలిపారు. ఆస్తి రికవరీ, సాంకేతిక చర్యలుప్రాపర్టీ లాస్ పెరిగినా రికవరీ కూడా ఎక్కువైంది. CEIR ద్వారా 1322 ఫోన్లు తిరిగి అందజేశారు. జీరో FIRలు 24 గంటల్లో రీ-రిజిస్టర్ చేస్తున్నారు. ఇండియన్ క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ తయారు చేసి, నేరస్తుల గుర్తింపును సులభతరం చేశారు.

మాదకద్రవ్యాలు, భద్రతా ప్రయోగాల కింద 7.26 కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం చేశారు, 256 కేసులు డిటెక్ట్ చేశారు. కొత్త రైల్వే స్టేషన్లలో RPF, GRP సంయుక్త పరిశీలనలు, సీసీటీవీల్లో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అమలు చేశారు.139 హెల్ప్‌లైన్‌కు కాల్ వచ్చిన 10 నిమిషాల్లో సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

ముఖ్య ఘటనలు, మౌలిక సౌకర్యాలు MMTS ఘటన తప్పుడు FIRగా తేలింది.. బాధితురాలు సెల్ఫీలు తీసుకుంటూ పడినట్టు వెల్లడించారు. శంకర్‌పల్లి ట్రాక్‌పై కారు నడిపిన మహిళకు మతిస్థిమితం లేదని తెలిపారు. నవ దంపతుల గొడవ తర్వాత ఆత్మహత్య. GRP పరిధిలో 4 మర్డర్ కేసులు, 1 కన్విక్షన్ (2024లో జీరో). లోక్ అదాలత్‌లో 133 కేసులు రాజీ. కేసు డిటెక్షన్ రేటు 10% పెరిగినట్లు చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వేలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరిగిందని.. సాంకేతికత వినియోగంలో సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
ధురంధర్ 2 పై విరాట్ కోహ్లీ రివ్యూ.. డైరెక్టర్ రిప్లై..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
నోరా ఫతేహి, సంజయ్ దత్ పాటపై మహిళా కమిషన్ సీరియస్..
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
కరివేపాకు అందరికీ ఆరోగ్యం కాదు! ఈ సమస్యలు ఉన్నవారు తింటే ప్రమాదమే
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?