G-20 SUMMIT: హైదరాబాద్‌లో ప్రారంభమైన జీ-20 ఆర్థిక సదస్సు.. హాజరైన 40 దేశాల ప్రతినిధులు

హైద్రాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి

G-20 SUMMIT: హైదరాబాద్‌లో ప్రారంభమైన జీ-20 ఆర్థిక సదస్సు.. హాజరైన 40 దేశాల ప్రతినిధులు
G20 Summit 2023
Follow us

|

Updated on: Mar 04, 2023 | 12:18 PM

హైద్రాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డిజిటల్ ఎకానమీ రంగంలో ఇండియా సాధించిన విజయాలపై సదస్సులో ప్రస్తావించనున్నారు ఇండియా ప్రతినిధులు. అలాగే 2030 నాటికి ఇండియా లక్ష్యాలను ఇతర దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌ (జీపీఎఫ్‌ఐ) పేరుతో జరుగుతోన్న ఈ సదస్సులో జీ 20 దేశాల ప్రతినిధులతోపాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు.

కాగా శుక్రవారం జీ 20 ఇండియా చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ హర్షవర్ధన్‌ శ్రింగ్లా జీ -20 మాట్లాడుతూ .. ఫిలిప్పైన్స్, భూటాన్, ఈజిప్ట్, శ్రీలంక, థాయ్‌లాండే, వియత్నాం తదితర దేశాల నుంచి ప్రతినిధులు జీ 20 సమ్మిట్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం, ఆర్థిక సమ్మిళిత, సమగ్రాభివృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ తదితర అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తారన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక, జీ 20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ 20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్‌ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చించనున్నట్టు వివరించారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..