AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Rains: ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని GHMC అధికారులు! స్పెషల్ గెస్ట్‌తో ఆఫీస్‌లోకి ఎంట్రీ..

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద, మురుగు భారీ మొత్తంలో వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అల్వాల్ ప్రాంతంలో..

TS Rains: ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని GHMC అధికారులు! స్పెషల్ గెస్ట్‌తో ఆఫీస్‌లోకి ఎంట్రీ..
Snake At GHMC Office
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 26, 2023 | 1:12 PM

Share

హైదరాబాద్‌, జులై 26: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద, మురుగు భారీ మొత్తంలో వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఓపిక నశించడంతో సంపత్ కుమార్ అనే యువకుడు అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు.

వర్షాల సందర్భంగా ఎలాంటి సమస్యలు ఉన్న తెలపాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇప్పటికే పల్లె టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్వాల్ ప్రాంతంలో ఉంటున్న సంపత్ అనే యువకుడు ఇంట్లోకి వర్షపు నీరుతో పాటు మురుగునీరు చేరటం వాటిల్లోనే పాము కనిపించడంతో జిహెచ్ఎంసి అధికారులకు పలుమార్లు ఫోన్ చేశాడు. అధికారులకు ఫోన్ చేసి గంటలు గడిచిన సరే స్పందన లేకపోవడంతో బుధవారం ఉదయం అల్వాల్ జిహెచ్ఎంసి కార్యాలయానికి ఆ పామును తీసుకొని వెళ్లి నిరసన వ్యక్తం చేశాడు.

పామును చూసి అవాక్కైనా అధికారులు

యువకుడి నిరసనతో ఒకసారిగా అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. పామును అధికారి టేబుల్ మీదికి తెచ్చిపెట్టి నిరసన తెలిపాడు సంపత్. ఆ పక్కనే ఉన్న తోటి అధికారులు సైతం పామును చూసి భయపడిపోయి బయటికి వెళ్లారు. తమ బాధను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేసినందుకు ఇలా పాములు తీసుకొచ్చాను అంటూ సంపత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.