Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Land Auction : భూముల అమ్మకం పూర్తి పారదర్శకం.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా : సర్కారు 6 పేజీల వివరణ

హైదరాబాద్ లోని కోకాపేట్, ఖానామెట్‌ భూముల వేలం పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ భూముల వేలంకు సంబంధించి వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం..

Land Auction : భూముల అమ్మకం పూర్తి పారదర్శకం.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా : సర్కారు 6 పేజీల వివరణ
Kokapet Lands
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 20, 2021 | 6:34 PM

Govt on Land Auction: హైదరాబాద్ లోని కోకాపేట్, ఖానామెట్‌ భూముల వేలం పూర్తి పారదర్శకంగా జరిగిందని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ భూముల వేలంకు సంబంధించి వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం 6 పేజీల ప్రకటనతో పూర్తిస్థాయి వివరణ ఇచ్చింది. భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని.. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ తాము నియంత్రించలేదని పేర్కొంది. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనేది పూర్తిగా అపోహేనని ప్రభుత్వ కొట్టిపారేసింది.

భూముల వేలంకు సంబంధించి ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామని, 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ ఖరారు చేశామని ప్రభుత్వం తెలిపింది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదన్న ప్రభుత్వం.. భూముల వేలానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి సరికాదంది. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని తెలిపింది. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నామని తెలిపిన సర్కారు.. పోటీని నివారించి, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని తన ప్రకటనలో పేర్కొంది.

Page One

Page One

Page Two

Page Two