AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Crime News: బాసరలో పెనువిషాదం..! నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

TS Crime News: బాసరలో పెనువిషాదం..! నదిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Crime News
Srilakshmi C
|

Updated on: Jan 23, 2023 | 4:32 PM

Share

ఏ కష్టమొచ్చిందో.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసరలో చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్‌కు చెందిన మానస అనే వివాహిత కుమారుడు బాలాదిత్య (8), కుమార్తె నవ్యశ్రీ (7)లను స్కూల్‌కు తీసుకెళ్తున్నాని చెప్పి గంగా హారతి ఇచ్చే ఘాట్‌ సమీప ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులను ఉంచి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టింది. అనంతరం ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులను గుర్తించారు. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.