AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gachibowli: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి గొంతు కోసి తోటి విద్యార్థి

Gachibowli: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌతిలో దారుణం చోటు చేసుకుంది. బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో ఉన్న సాత్విక్‌ అనే విద్యార్థి గొంతును..

Gachibowli: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి గొంతు కోసి తోటి విద్యార్థి
Subhash Goud
|

Updated on: Apr 29, 2022 | 1:58 PM

Share

Gachibowli: దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌతిలో దారుణం చోటు చేసుకుంది. బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో ఉన్న సాత్విక్‌ అనే విద్యార్థి గొంతును తోటి సెకండియర్‌ చదువుతున్న వంశీ అనే విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, అతన్ని గచ్చిబౌలి ఆస్పత్రి (Hospital)కితరలించి చికిత్స అందిస్తున్నారు. గొంతు మెడభాగంలో 9 కుట్లు చూశారు. అల్పాహారం విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో టీచర్ సర్టిచెప్పి అక్కడి నుంచి పంపించారు. అదే రోజు అర్ధరాత్రి 1.30 సమయంలో సాత్విక్‌పై సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దాడికి దిగాడు. సాత్విక్‌ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు టీచర్‌ తెలిపారు.

కరోనా తరువాత సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ పిల్లలు పెడదారి పడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. సాత్విక్‌ పై దాడి చేసిన తోటి విద్యార్థి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గురుకుల పాఠశాల లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటినుంచి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులు ఎలా ఉండాలో నేర్పుతామని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bhadrachalam: మత్తుమందు ఇచ్చి గర్భిణిపై ఎంఎన్‌వో అత్యాచారయత్నం.. భద్రాచలంలో అమానుష ఘటన

AP: గుంటూరు జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి ఘటనలో కొత్త కోణం.. ప్రకంపనలు