AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముళ్ల పొదల్లో కుళ్లిన మృతదేహం.. విచారణతో వెలుగులో సంచలన నిజం..

శంషాబా‌ద్‌లో అనుమానాస్పద స్థితిలో భారతి అనే బాలిక మృతిని హత్యగా పోలీసులు తేల్చారు. ఈ హత్యను బాలిక మేనమామ కొడుకే..

Hyderabad: ముళ్ల పొదల్లో కుళ్లిన మృతదేహం.. విచారణతో వెలుగులో సంచలన నిజం..
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 17, 2023 | 7:21 PM

Share

శంషాబా‌ద్‌లో అనుమానాస్పద స్థితిలో భారతి అనే బాలిక మృతిని హత్యగా పోలీసులు తేల్చారు. ఈ హత్యను బాలిక మేనమామ కొడుకే చేసినట్లు నిర్ధారించారు. కొన్నూరు భారతి, వనపర్తికి చెందిన తన మేనమామ కొడుకు విష్ణు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగింది. ఆ తర్వాత 4 నెలలుగా విష్ణుని దూరం పెట్టిన భారతి.. ఇతరులతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. టిది తట్టుకోలేని విష్ణు ఈ హత్యకు పధకం పన్నాడు. ఆ యువతిని నమ్మించి స్థానిక మధురానగర్‌లోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి.. ఆపై బండ రాయితో మోది హత్య చేశాడు. ఈ హత్య ఏప్రిల్ 11న చోటు చేసుకోగా.. ఆ తర్వాత మూడు రోజులు అనగా ఏప్రిల్ 14న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కాగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో విష్ణుని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె స్రవంతి ఇంటి వద్దే ఉంటుంది. ఆ దంపతులు ఇద్దరూ కూడా అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ నెల 11న ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇక అదృశ్యమైన బాలిక ఆనవాళ్లతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా.. ఓ మృతదేహం మధురానగర్‌లోని ముళ్ల పొదల్లో పోలీసులకు లభ్యమైంది. మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా.. తమ కూతురుదేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. ఆ సమయంలో బాలికను తలపై రాయితో మోది చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే ఈ ఘటనను పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇక ఎట్టకేలకు హత్య చేసింది నిందితుడు బాలిక మేనమామ కొడుకేనని తేల్చారు.

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి