AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మహిళను చంపింది అతనే.. నిందితుడిని పట్టించిన కండోమ్.. మేడ్చల్‌ ఘటనలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌లో వరుస హత్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే.. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. బండరాళ్లతో మోదీ.. ఆపై పెట్రోల్‌ పోసి మహిళ మృతదేహాన్ని తగలబెట్టడం సంచలనంగా మారింది.

Hyderabad: మహిళను చంపింది అతనే.. నిందితుడిని పట్టించిన కండోమ్.. మేడ్చల్‌ ఘటనలో సంచలన విషయాలు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 28, 2025 | 7:10 AM

Share

హైదరాబాద్‌లో వరుస హత్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే.. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. బండరాళ్లతో మోదీ.. ఆపై పెట్రోల్‌ పోసి మహిళ మృతదేహాన్ని తగలబెట్టడం సంచలనంగా మారింది.. అయితే.. మేడ్చల్‌లో మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మహిళను హత్య చేసిన నిందితుడిని కండోమ్‌ పట్టించింది. మేడ్చల్‌ డీసీపీ కోఠిరెడ్డి సోమవారం మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డబ్బు విషయంలో జరిగిన గొడవ హత్యకు దారి తీసిందని.. నిందితుడిని కండోమ్ పట్టించిందని తెలిపారు..

అసలేం జరిగిందంటే..

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సమీపంలోని సెట్టిపేట్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ.. భర్తతో విభేదాలతో హైదరాబాద్ నగరానికి వచ్చింది.. కుషాయిగూడలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే.. మహిళ ఈ నెల 24న పని కోసం మేడ్చల్‌ బస్టాప్‌ దగ్గరికి వచ్చింది. శామీర్‌పేట మజీద్‌పూర్‌లో ఉండే షేక్‌ ఇమామ్‌ (37) ఆమెతో మాటలు కలిపాడు.. ఈ సమయంలోనే.. ఏకాంతంగా గడిపేందుకు రావాలని.. అలా వస్తే రూ.500 ఇస్తానంటూ మహిళను ఒప్పించాడు.

ఆ తర్వాత ఇమామ్ సదరు మహిళ ఇద్దరూ కలిసి మునీరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత మహిళ ఎక్కువ డబ్బులు అడగడంతో ఇమామ్‌ ఆగ్రహంతో ఆమెతో గొడవపడ్డాడు.. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి రాయితో కొట్టి మహిళను చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ముమ్మరంగా దర్యాప్తు చేశారు.. మృతురాలి ఫోన్‌ నెంబర్ ఆధారంగా హత్యకు ముందు ఆమె ఎక్కడుంది..? ఆమె వెంట ఎవరున్నారని ఆరా తీసినప్పుడు.. మహిళ మునీరాబాద్‌ సమీపంలో తిరిగినట్లు గుర్తించారు.

అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజ్‌లు పరిశీలించగా ఓ మెడికల్‌ షాపు దగ్గర మహిళ, మరో వ్యక్తి కనిపించారు. అక్కడ వారు కండోమ్‌లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. అక్కడ చేసిన డిజిటల్‌ చెల్లింపుల ఆధారంగా నిందితుడి ఫోన్‌ నెంబర్‌ను గుర్తించి.. ఇమామ్‌ అనే వ్యక్తిదేనని నిర్ధారించుకున్నారు.. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని.. సోమవారం కోర్టులో హాజరుపర్చారు.. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..