AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ

అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్‌కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు.

Asaduddin Owaisi: పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హతలేదు.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 10, 2025 | 3:46 PM

అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్‌కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్ దృశ్చర్యలను ప్రతిఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ప్రభుత్వసలహాదారుడు షబ్బీర్ అలీతో కలిసి ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తుందని విమర్శించారు. భారతదేశం నుండి విడిపోయిన తరువాత పాకిస్తాన్.. ఇక్కడి హిందువులకు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పెహాల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందు అతికిరాతకంగా హతమార్చారు… అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారన్నారు. పాకిస్తాన్ ఆర్మీ సివిలియన్స్ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతుందని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఒవైసీ అన్నారు. భారతదేశ ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని… సైనికులకు అండగా ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.

బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక భేటీ

శనివారం రాత్రి గం. 8.20కి బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు నడ్డా. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలపై ఎంపీలతో నడ్డా చర్చించనున్నారు. ఉద్రిక్తతల వేళ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే నొప్పులన్నీ మాయం అవుతాయి..!
ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే నొప్పులన్నీ మాయం అవుతాయి..!
ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది..!
ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది..!
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని