AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు.. సీఎం కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న...

Telangana: రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు.. సీఎం కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Komatireddy Rajagopal Reddy
Ganesh Mudavath
|

Updated on: Jul 24, 2022 | 7:42 AM

Share

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిశానని, ఈ సమావేశం అనంతరం అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయని చెప్పారు. అమిత్ షాను (Amit Shah) కలవటం ఇప్పుడేం కొత్త కాదన్న రాజగోపాల్ రెడ్డి.. అనేక సార్లు కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ దినపత్రికతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కార్యకర్తలు, అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు , అభిమానులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురికావద్దని సూచించారు.

మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా అదనంగా కేటాయించలేదు. అనేక సంవత్సరాలుగా అడుగుతున్న గట్టుప్పల్ మండలాన్ని వెంటనే ప్రకటించారు.నాయకులను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు. భువనగిరి లోక్ సభతో పాటు మునుగోడు శాసనసభ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. అందరితో కలిసి చర్చించిన తర్వాతే కేసీఆర్ కుటుంబం, ఆయన అవినీతి కుటుంబ పాలనపై మన బహిరంగ యుద్ధ ప్రకటన చేద్దాం. అది కూడా లక్ష మంది సమక్షంలో చేస్తాం. నేను అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రతిపాదించిన కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలి.

– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి

ఎనిమిదేళ్లుగా ఎస్ఎల్బీసీ సారంగంతోపాటు, అన్నీ పూర్తయిన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనులను పక్కనబెట్టిన కేసీఆర్.. ఇప్పుడు హడావిడి చేస్తున్న తీరును ప్రజలంతా గమనించాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలతో సమానంగా అన్ని విధాలుగా వెనకబడిపోయిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు ముందుకు వస్తే తాను ఏ త్యాగానికైనా సిద్ధమని వెల్లడిచారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ అండ్ టీం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!