Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cable Bridge: వాహనదారులకు అలెర్ట్‌.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాక‌పోక‌లు బంద్‌.. ఎప్పటివరకంటే?

వాహనదారులకు అలెర్ట్‌.. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ఈరోజు (ఏప్రిల్‌) నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్‌ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లతో తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు.

Cable Bridge: వాహనదారులకు అలెర్ట్‌.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాక‌పోక‌లు బంద్‌.. ఎప్పటివరకంటే?
Durgam Cheruvu Cable Bridge
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2023 | 7:23 AM

వాహనదారులకు అలెర్ట్‌.. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ఈరోజు (ఏప్రిల్‌) నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్‌ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లతో తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు. భారీ వాహనాలు, ప్రత్యేక పరికరాలు, యంత్రాలు కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని, ఆ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు. బ్రిడ్జి తనిఖీల కోసం భారీ బరువు ఉన్న క్రేన్లు, వాహనాలు, యంత్రాలు, పరికరాలను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని, ఆ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, అందుకే మూడు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిని మూసివేయనున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్‌ సూచించారు. మరోవైపు ఈ మూడు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. రోడ్‌ నం.45 నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను రెండు మార్గాల్లో మళ్లిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరారు.

కాగా హైదరాబాద్‌లో ఐకానిక్ వంతెనగా పేరున్న కేబుల్ బ్రిడ్జి సందర్శకులను ఆకట్టుకుంటుంది. చెరువుపై తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా తరలివస్తుంటారు. వీకెండ్‌లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చూసేందుకు శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే రెగ్యులర్ మెయింటెనెన్స్‌లో భాగంగా వంతెనను పూర్తి స్థాయిలో పరీక్షించాల్సి ఉన్నందున బ్రిడ్జిని మూసివేయనున్నారు. దయచేసి వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..