AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి..తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూశారు. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషణ్‌ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సుభాషన్ […]

జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతి..తెలుగు రాష్ట్రాల సిఎంల సంతాపం
Ram Naramaneni
|

Updated on: May 01, 2019 | 4:44 PM

Share

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూశారు. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుభాషణ్‌ రెడ్డి.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు చేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సుభాషన్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా గతంలో ఆయన లోకాయుక్త చైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డికి ముగ్గురు కుమారులు.