AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చక్రం తిప్పిన ఎమ్మెల్సీ కవిత, అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు

ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు.

చక్రం తిప్పిన ఎమ్మెల్సీ కవిత, అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు
MLC Kavitha
Balu Jajala
|

Updated on: Feb 13, 2024 | 3:10 PM

Share

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు.

అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్ లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలు మారే కౌన్సిలర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు జిల్లాలో అవిశ్వాస తీర్మానాల రచ్చ మొదలైంది. నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఈ వ్యవహరం ఎక్కువగా ఉంది. అయితే బీఆర్ఎస్ కీలక నేతలు రంగంలోకి దిగి తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా మంతనాలు సాగిస్తూ పార్టీ కోసం శ్రమిస్తున్నారు.

కాగా ప్రస్తుత ఎమ్మెల్సీ హోదాలో లో ఉన్న కవిత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. గతంలో ఆమె నిజామబాద్ నుంచి బరిలో నిలిచి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికలు కీలకాం కానుండటంతో ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచ పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే టీకాంగ్రెస్ ఒకవేళ ప్రియాంకగాంధీ లేదా రాహుల్ గాంధీని పోటీకి దించితే, వారిపై కవిత పోటీ చేసే అవకాశాన్నట్టు తెలుస్తోంది.