AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో ఆటో, క్యాబ్‌, లారీల బంద్‌ నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఆటో, క్యాబ్‌, లారీ కార్మికులు మహాధర్నాను నిర్వహించనున్నట్లు జేఏసీ వెల్లడించింది

Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు బంద్.. ఖైరతాబాద్ RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నాకి పిలుపు
Hyderabad Transport
Surya Kala
|

Updated on: May 19, 2022 | 6:13 AM

Share

Hyderabad: కొత్త సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ వ్యతిరేకంగా తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల-జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు రాష్ట్రం లో ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలును బంద్ (auto unions, cabs, buses and truck owners) చేస్తున తెలంగాణ రాష్ట్ర (Telangana) ప్రైవేట్ డ్రైవర్లు. హైదరాబాద్ ఎల్బీ.నగర్ లో ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలును నిలిపివేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కోటగా ఏర్పాటు చేసిన మోటర్ వాహనాల చట్టం అమలు చేసి జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ ల వద్ద దోపిడీ చేస్తున్నారని ప్రయివేట్ వాహనదారుల సంఘంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల..2019 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికల్ ఫిట్‌నెస్ రెన్యువల్, డ్రైవర్ల సెటిల్‌మెంట్ లో రోజుకు రూ.50 వసూలు చేయాలన చట్టాన్ని నిలిపివేయాలని తెలంగాణ జేఏసీ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వెహికల్స్ కి ఒకప్పుడు ఫిట్నెస్ లైసెన్స్ చేయించుకోవాలంటే రూ. 500 లేదా రూ. 1000 తో అయిపోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా లైసెన్స్ అయిపోయిన రోజు నుంచి రోజుకి యాభై రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు దాదాపు ఒకటి-రెండు సంవత్సరాలు ఫైన్ ఒకే సారిగా కట్టాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ కొత్త మోటార్ ట్రాన్స్​పోర్ట్ వాహన యాక్ట్ ని వ్యతిరేకిస్తూ బందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణలో ఆటో, క్యాబ్, లారీ, సంఘాల-జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని RTA ఆఫీస్ వద్ద భారీ ధర్నా  నిర్వహించనున్నారు. మహా ధర్నాకు కార్మికులు భారీగా తరలిరావాలని జేఏసీ యూనియన్ నేతలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

Reporter: vidhay, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..