AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అమ్మను బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి చంపారు.. వారాసిగూడ మహిళ మృతి కేసులో సంచలన ట్విస్ట్‌

సికింద్రాబాద్‌ మహిళ డెత్‌ కేసులో మరో ట్విస్టు బయటకు వచ్చింది. తమ తల్లి చనిపోయిన తర్వాతిరోజే ఓ సూసైడ్‌ నోట్‌ రాశారు ఇద్దరు కూతుళ్లు. అందులో వాళ్లు సంచలన ఆరోపణలు చేశారు. తల్లిని బ్లాక్‌ మ్యాజిక్‌ ద్వారా చంపారని ఆరోపణలు చేశారు.. అంతేకాకుండా.. పలువురి పేర్లను, ఫోన్ నెంబర్లను రాయడం సంచలనంగా మారింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మా అమ్మను బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి చంపారు.. వారాసిగూడ మహిళ మృతి కేసులో సంచలన ట్విస్ట్‌
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2025 | 6:51 PM

Share

వారాసిగూడ డెత్‌ కేసు మిస్టరీగా మారింది. తల్లి శవంతో వారం రోజుల పాటు ఇంట్లో ఉన్న కూతుళ్ల మానసిక స్థితిపైనే ఆందోళన ఉంది. అంతేకాదు ఈ కేసులో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. జనవరి 22న లలిత మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23న లలిత ఇద్దరు కూతుళ్లు రవలిక, యశ్విత చనిపోడానికి ప్రయత్నించారు. అంతకన్నా ముందు సూసైడ్‌ నోట్‌ రాశారు. అయితే సూసైడ్‌ చేసుకునే ధైర్యం వారికి చాలలేదు. ఇప్పుడు తల్లి లలిత మరణం బయటకు రావడంతో పోలీసుల దర్యాప్తులు ఓ నోట్‌ దొరికింది. దానిలో చాలా విషయాలు రాసుకొచ్చారు.

ఐదేళ్లుగా తండ్రి ఇంటికి రాకపోయేసరికి పలుమార్లు మిస్సింగ్‌ కేసు పెట్టామని.. పోలీసులు పట్టించుకోలేదని రాసుకొచ్చారు. ఇక తన తల్లి చావుకి బిట్ల రమేష్‌, ప్రకాష్‌రెడ్డి, తండ్రి రాజు వారితోపాటు.. ఇంటి ఓనర్లు ప్రియాంక, సుశీల కారణం అంటూ నోట్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

తమ ఇంటి ముందున్న కిరాణా షాప్‌ వాళ్లు ఇంటి ఓనర్లు బ్లాక్‌ మ్యాజిక్‌ చేస్తారని చెప్పడంతో.. జనవరి 30కి ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పామన్నారు. ఇంతలోపే.. ఇంటి ఓనర్లతో కలిసి తమ మేనమామ, తండ్రి, బంధువులు బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి తల్లిని చంపేశారంటూ ఆరోపించారు.

తమ తల్లి మరణానికి కారణమైన వీరికి కఠిన శిక్ష పడాలంటూ సూసైడ్‌ నోట్‌లో డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. ఐదుగురి పేర్లు, ఫోన్‌ నెంబర్లు నోట్‌లో రాశారు రవళిక, యశ్విత..

అయితే వీరి తల్లి లలిత ఎలా చనిపోయిందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె అనారోగ్యంతో చనిపోయిందా? ఎవరైనా మర్డర్‌ చేశారా అనే విషయం బయటపడాల్సి ఉంది. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్