AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Prajavani: ‘సారూ.. బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు అంటుండ్రు..పింఛన్‌ ఇస్తలేరయ్యా’ ఓ వృద్ధురాలి ఆవేదన

జీవితమంతా కష్టించి వయసుడిగి పోయిన పండుటాకులను ప్రభుత్వ అధికారులు నానాయాతన పెడుతున్నారు. బతికున్నోళ్లను రికార్డుల్లో చంపేసి.. పింఛన్‌కు ఎగనామం పెడుతున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు తన ఆవేధన చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. ‘నేను బతికే ఉన్న. పింఛన్‌ ఇవ్వండి సారూ’ అంటూ సదరు వృద్ధురాలు అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా.. కనికరించ లేదు. ఈ క్రమంలో విసిగిన ఆ పండుటాకు సోమవారం కలెక్టరేట్‌లో..

TG Prajavani: 'సారూ.. బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు అంటుండ్రు..పింఛన్‌ ఇస్తలేరయ్యా' ఓ వృద్ధురాలి ఆవేదన
Request For Old Age Pension
Srilakshmi C
|

Updated on: Jul 16, 2024 | 10:57 AM

Share

హైదరాబాద్‌, జులై 16: జీవితమంతా కష్టించి వయసుడిగి పోయిన పండుటాకులను ప్రభుత్వ అధికారులు నానాయాతన పెడుతున్నారు. బతికున్నోళ్లను రికార్డుల్లో చంపేసి.. పింఛన్‌కు ఎగనామం పెడుతున్నారు. తాజాగా ఓ వృద్ధురాలు తన ఆవేధన చెప్పుకుని కన్నీరుమున్నీరైంది. ‘నేను బతికే ఉన్న. పింఛన్‌ ఇవ్వండి సారూ’ అంటూ సదరు వృద్ధురాలు అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నా.. కనికరించ లేదు. ఈ క్రమంలో విసిగిన ఆ పండుటాకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకుంది. వివరాల్లోకెళ్తే..

ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే రుక్నమ్మ (59)కు భర్త చనిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. పింఛన్‌ ఇప్పించమని తహసీల్దార్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని కన్నీటి పర్యంతమైంది. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు చెప్పడంతో విస్తుపోయింది. కళ్లెదుట మనిషిని వచ్చి నిలబడితే.. నువ్వసలు బతికున్నావో.. లేవో.. అని అధికారులు అడుగుతున్నారయ్యా! అని వాపోయింది. గత ప్రభుత్వంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కూడా మంజూరైంది.

ఇప్పుడున్న సర్కార్‌ పింఛన్‌ ఇస్తలేరని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రజావాణిలో గతంలో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చానని, ఎన్నిసార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా మంజూరు కావడం లేదని తెలిపింది. తన సమస్యను ఏ అధికారి పరిష్కరించడం లేదని, కలెక్టర్‌ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. నాకు పింఛన్‌ ఇచ్చేందుకూ వీళ్లకు చేతులొస్తలేవని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, తప్పుల తడకగా వివరాలను నమోదు చేస్తుండటంతో ఇలా నిత్యం ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇలా దోసె చేస్తే ఒకటి కాదు.. నాలుగు తింటారు!
ఇలా దోసె చేస్తే ఒకటి కాదు.. నాలుగు తింటారు!
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..