రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.. 11 నిమిషాల్లో రీఫండ్.. అదెలా సాధ్యంమంటే..

హైదరాబాదులో సైబర్ క్రైమ్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. సగటున గంటకు ముగ్గురు బాధితులు సైబర్ నేరస్తుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వివిధ మార్గాల్లో స్కామ్‎లకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లు నెలకి కోట్ల రూపాయలను కాజేస్తున్నారు.

రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు.. 11 నిమిషాల్లో రీఫండ్.. అదెలా సాధ్యంమంటే..
Cyber Crime
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 29, 2024 | 3:20 PM

హైదరాబాదులో సైబర్ క్రైమ్ భారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. సగటున గంటకు ముగ్గురు బాధితులు సైబర్ నేరస్తుల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వివిధ మార్గాల్లో స్కామ్‎లకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లు నెలకి కోట్ల రూపాయలను కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‎కు చెందిన ఒక యువకుడు రూ.18 లక్షలు సైబర్ నేరస్తుల బారిన పడి పోగొట్టుకున్నాడు. అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి జూన్ 17న తనకి ఫెడెక్స్ నుండి ఒక కాల్ వచ్చింది. తన పేరు మీద ఒక పార్సల్ వచ్చిందంటూ నమ్మించారు. ఆ వెంటనే మరొక నెంబర్ నుండి ముంబై పోలీసుల పేరుతో కాల్ చేశారు. మీ పేరు మీద ఇల్లీగల్‎గా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని కేసు నమోదు చేసినట్లు బాధితుడుని నమ్మించారు. బాధితుడు ఆధార్ కార్డు వివరాలు తెలుసుకున్న నిందితులు తనను మరింత భయభ్రాంతులకు గురి చేసేలా నటించారు. ముంబై నుండి ఇరాన్‎కు తన పేరు మీద డ్రగ్స్ కొరియర్ అవుతున్నట్లు బాధితుడిని భయపెట్టారు.

ఇదంతా స్కైప్ వీడియో కాల్‎లో మాట్లాడిన సైబర్ నేరగాళ్లు.. తాము చెప్పినట్లు చేస్తే కేసు నుండి తప్పిస్తామని బెదిరించారు. ఒక నకిలీ ఎఫ్‎ఐ‎ఆర్‎ను సైతం చూపించారు. తమ అకౌంట్‎కి డబ్బులు పంపిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెరిఫై చేసి తిరిగి డబ్బులను వాపసిస్తామని బాధితుడిని నమ్మించారు. వీరి మాటలను నమ్మిన బాధితుడు తన వద్ద రూ.18 లక్షల రూపాయలు లేవని కేటుగాళ్లకు చెప్పాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఒక నకిలీ ఆర్బీఐ నోటిఫికేషన్ సైతం తయారుచేసి బాధితుడికి పంపించారు. దీంతో భయపడిపోయిన బాధితుడు తన ఫోన్ నుండి లోన్ అప్లై చేసి రూ.18 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సైబర్ నిందితులు చెప్పిన అకౌంట్‎కి ఆ రూ.18 లక్షలు బదిలీ చేశాడు. డబ్బులు పంపగానే వారి కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

గురువారం సాయంత్రం 06:58 గంటలకు బాధితుడు నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలో కేసు ఛేదించారు. డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ ఎస్సీఆర్పీ పోర్టల్‎లో ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి బాధితుడు అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయిన రూ.18 లక్షలను రాత్రి 7.09 గంటలకు బ్లాక్ చేయించారు. 11 నిమిషాల వ్యవధిలో ఈ ఆపరేషన్స్ సక్సెస్ కావడంతో దర్యాప్తు చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్‎ను ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స