దీంతో హైదరాబాద్ మహా నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అతి పొడవైన ఆరు లేన్ల షేక్పేట్ ఫ్లైఓవర్ను శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా టూ వే ట్రాఫిక్ను ఏర్పాటు చేశారు. షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుంది. షేక్పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.
Happy New Year Hyderabad
Here’s a glimpse of the Shaikpet Flyover built by @GHMCOnline under the #SRDP
My compliments to the SRDP Engineering team on a great job 👏
P.s: Please don’t copy these images and advertise in election bound states 😛 pic.twitter.com/s2yan9tQd7
— KTR (@KTRTRS) January 1, 2022
ఇదిలావుంటే, హైదరాబాద్లో ఫ్లై ఓవర్ ప్రారంభం మరో శుభపరిణామమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. త్వరలో హైదరాబాద్లో నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, శంఖుస్ధాపనలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.