Hyderabad: టు లెట్ బోర్డు కనిపిస్తే చాలు వాడికి పండగే.. హైదరాబాద్లో వెలుగు చూసిన నయా మోసం..
ఎక్కువ అద్దె వస్తుందని ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మాయగాడిని హుస్సేని హాలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎక్కువ అద్దె వస్తుందని ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మాయగాడిని హుస్సేని హాలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీలో టు లెట్బోర్డు కనిపిస్తే అంతే.. గద్దలా వాలిపోతాడు.. చిన్న చిన్న దుకాణాలకు ఇస్తే అద్దె ఏం వస్తుందని యజమానులను బురిడీకొట్టిస్తాడు. పెద్ద పెద్ద బ్యాంక్ఏటీఎం సెంటర్లకు ఇస్తే నెలకు అద్దె రూ. 30 వేల వరకు వస్తుందని మాయమాటలతో నమ్మిస్తాడు. యజమాని ఓకే అనగానే కొలతలు తీసుకుందామని, కొలతలు తీసుకున్నట్లు నటిస్తాడు. రెండు కాగితాలు చూపించి మీరు ఇపుడు రూ.20 వేలు చెల్లిస్తే ఈ అమౌంట్రీఫండబుల్ అవుతుందని నమ్మిస్తాడు. లక్కీ చాన్స్ పోగొట్టుకోవద్దంటూ.. ఒక్కొక్కరివద్ద నుంచి రూ.18వేల నుంచి రూ. 30వేలు వరకు నొక్కేస్తాడు. ఆ తరువాత పత్తా లేకుండా పోతాడు. ఒకవేళ దొరికితే సెటిల్ చేస్తానంటూ వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లిస్తాడు. ఈ తరహా నయా మోసానికి పాల్పడుతున్న కేటుగాడిని హుస్సేనిహాలం పోలీసులు అరెస్ట్ చేశారు.
హుస్సేనిహాలం ఇన్స్పెక్టర్నరేష్తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్పురాకు చెందిన ఎంబీఏ విద్యార్థి, రియల్ఎస్టేట్ ఏజెంట్మొహమ్మద్అబ్దుల్ ఖుద్రూస్ (32) గత కొంత కాలంగా కామాటిపురా, ఫలక్నుమా, రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలలో ఖాళీ మల్గీలలో బ్యాంకు సంబంధించిన ఏటీఎం సెంటర్పెట్టిస్తానని, నెలకు రూ.30వేల వరకు సమయానికి అద్దె వస్తుందని మాయమాటలతో నమ్మించి, రీఫండబుల్అమౌంట్పేరిట ఒక్కొక్కరి దగ్గర రూ.18వేల నుంచి రూ.20వేల వరకు నొక్కేశాడు. తాజాగా హుస్సేనిహాలం పోలీస్స్టేషన్ పరిధిలో కూడా కోకాబజార్కు చెందిన మీర్జా ఆలీబేగ్(50) వద్ద డబ్బులు నొక్కేశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన మీర్జా ఆలీబేగ్.. వెంటనే హుస్సేనిహాలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ఖుద్రూస్ పై ఐపిసి 419, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును హుస్సేని హాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..