AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓ ఇంటి నుంచి వింత వాసన.. చెక్ చేయగా.. అధికారులే కళ్లు తేలేసారు

గంజాయి మత్తుతో యువత చిత్తు అవుతోంది. భవిష్యత్తు తరాలు ఏమైపోతాయా అనే భయం మొదలవుతోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ.. కేటుగాళ్లు తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. అక్రమ దందాను రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Telangana: ఓ ఇంటి నుంచి వింత వాసన.. చెక్ చేయగా.. అధికారులే కళ్లు తేలేసారు
Ganja
Ravi Kiran
|

Updated on: Mar 31, 2025 | 9:25 AM

Share

మత్తుకు తెలుగు రాష్ట్రాల యువత చిత్తు అవుతున్నారు. గంజాయి అక్రమ దందా తెలుగు రాష్ట్రాల్లోనూ యదేచ్చగా సాగుతోంది. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టి.. గంజాయి పెంపకం, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ మధ్య కేటుగాళ్లు తమ అక్రమ దందాను సరికొత్తగా క్రియేటివిటీతో కొనసాగిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ముంతాజ్ అనే మహిళ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంపకం షురూ చేసింది. ఆమె ఇంటి నుంచి గుప్పుమని ఘాటైన వాసన రావడంతో చుట్టుప్రక్కల వారికి.. డౌట్ వచ్చి.. స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే మహిళ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. గంజాయి మొక్కల పెంపకంపై పలు విషయాలను ఆరా తీశారు. అయితే ముంతాజ్ తాను మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు గంజాయి అని తనకు తెలియదని.. తెలియక విత్తనాలు వేశానని వివరణ ఇచ్చింది. తనకు తెలిసిన వ్యక్తులు ఆ మొక్కలు మంచివి కాదన్నారు.. రాత్రి కదా అని పొద్దునే తీయాలనుకున్నా.. ఈలోపే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి