AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదుసార్లు ఎమ్మెల్యే.. సాధారణ జీవితం.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అవమానం..!

ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాశారు. ప్రజా సమస్యలు చెబుతామని 4 సార్లు దీనంగా నిలబడ్డారు. అయినా సీఎం కాన్వాయ్ చూసినట్లుగా ముందుకు వెళ్లిపోయింది. కలుసుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యే.. సాధారణ జీవితం.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అవమానం..!
Former Mla Gummadi Narsaiah
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 21, 2025 | 4:18 PM

Share

గుమ్మడి నర్సయ్య.. ఈ పేరు వినగానే సాధారణ జీవితం.. సాదాసీదాగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఉండే నేత. బస్సులు, ఆటోలో సామాన్య వ్యక్తిలా ఎక్కడికైనా వెళుతుంటారు. అవసరమైతే రోడ్డుపై నడుస్తూ వెళతారు. కాన్వాయ్‌లు, గన్‌మెన్స్, అనుచరులు హడావుడి ఇలా ఏమి ఉండదు. ఇల్లందు నుంచి ఐదుసార్లు సిపిఐ(ఎమ్ఎల్) తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా సామాన్య వ్యక్తిలా ఉంటారు. అలాంటి నేతకు అవమానం జరిగిందా..?

ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అటువంటి నేతకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా గేట్ దగ్గర అడ్డుకుంటారా.. అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడంపై మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు అఖిల పక్షం తో వెళితే కలవలేదని, ఇటీవల సీఎం ఇంటికి కలుద్దామని ఒక్కడినే వెళ్లినా.. అనుమతి లేదని, గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, సాగునీటి సమస్యలు చెప్పుకుందామని వెళ్ళానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. ప్రజల సమస్యలనే మేము ప్రభుత్వాలు, సీఎం దృష్టికి తీసుకు వెళతామన్నారు. వ్యక్తిగత సమస్యలు ఏముంటాయన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ను కలిసే అవకాశం ఇవ్వలేదు. గత మంత్రులకు అనేక సమస్యలపై చెప్పి విసుగు వచ్చింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపులో మేము కూడా కృషి చేశామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు కోసం వెళ్ళే మమ్మల్ని ఈ విధంగా అడ్డుకుని అవమానించడం సరికాదన్నారు గుమ్మడి నర్సయ్య.

ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాశారు. ప్రజా సమస్యలు చెబుతామని 4 సార్లు దీనంగా నిలబడ్డారు. అయినా సీఎం కాన్వాయ్ చూసినట్లుగా ముందుకు వెళ్లిపోయింది. కలుసుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే