AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసలు నోట్లుగా నమ్మిస్తారు.. నమ్మితే నట్టేట ముంచేస్తారు.. ముఠాను పట్టుకున్న పోలీసులు

ఈ నోట్లు చూడ్డానికి సేమ్ టూ సేమ్ ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ మాదిరే ఉంటాయి. కానీ.. అవి నకిలీ గాళ్లు సృష్టించిన ఫేక్ నోట్లు(Fake Currency). అసలు నోటు ఏదో, నకిలీదేదో తెలియక జనం తేలిగ్గా మోసపోయేలా ప్లాన్ చేశారు....

Telangana: అసలు నోట్లుగా నమ్మిస్తారు.. నమ్మితే నట్టేట ముంచేస్తారు.. ముఠాను పట్టుకున్న పోలీసులు
Fake Currency
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Jun 08, 2022 | 10:11 AM

Share

ఈ నోట్లు చూడ్డానికి సేమ్ టూ సేమ్ ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ మాదిరే ఉంటాయి. కానీ.. అవి నకిలీ గాళ్లు సృష్టించిన ఫేక్ నోట్లు(Fake Currency). అసలు నోటు ఏదో, నకిలీదేదో తెలియక జనం తేలిగ్గా మోసపోయేలా ప్లాన్ చేశారు ఈ కేటుగాళ్లు. ఖమ్మం జిల్లా చర్లలో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపుతున్నాయి. చర్ల మండలంలో ఉన్న అమాయక ఆదివాసీలే టార్గెట్‌గా నకిలీ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతోంది. గుంటూరు (Guntur)జిల్లా తెనాలికి చెందిన దొంగనోట్ల ముఠా.. చర్ల మండలం తెగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి, కొంత కాలంగా చర్లలో దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న కిరాణా షాపులు, నాన్ వెజ్ మార్కెట్లలో నకిలీ నోట్లతో నిలువునా ముంచేస్తోందీ దొంగ గ్యాంగ్. తాజాగా కారులో దొంగనోట్లను తరలిస్తుండగా చర్లలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 5లక్షల 15 వేల 500 విలువ గల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రాచలం(Bhadrachalam) ఏఎస్పి రోహిత్ రాజు తెలిపారు.

2వందలు, 5వందలు, 2వేల నోట్లను తెనాలిలో ముద్రించి చర్ల పరిసర ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగ నోట్లతో పాటు ఫేక్ కరెన్సీని తయారు చేసే యంత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో చేతులు కలిపిన ఒక బాలుడు, ఒక యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి