AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. సెకన్లలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో లక్ష రూపాయలు..!

కాస్తా ఛార్జింగ్ తగ్గడంతో ఇంటి ముందు.. ఛార్జింగ్ పెట్టారు. ఇంతలో.. ఒక్కసారి మంటలు వ్యాపించాయి..అంతేకాదు ఆ మంటలు ఇంట్లోకి కూడా వ్యాపించాయి. దీంతో, కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు..

Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. సెకన్లలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో లక్ష రూపాయలు..!
Exploded Electric Bike
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 22, 2024 | 4:41 PM

Share

బాబోయ్‌ పేలిపోతున్న ఎలక్ట్రీటిక్ బైకులు.. బెంబేలెత్తిపోతున్న జనాలు.. అవును గత కొద్ది రోజులు ఎలక్ట్రీటిక్ బైక్‌ పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి ఇటీవల ఎలక్ట్రిటిక్ బైక్ కొనుగోలు చేశాడు.. వ్యవసాయ పనుల కోసం.. ఈ బైక్ ను వినియోగిస్తున్నాడు.. అయితే గురువారం ఛార్జింగ్ తగ్గడం తో ఇంటి ఆవరణలో ఉన్న ఫ్లగ్ లో ఛార్జింగ్ పెట్టారు తిరుపతి రెడ్డి. పెట్టిన కొద్దీ నిమిషాల్లో బైక్ పెళ్లిపోయింది, మంటలు వ్యాపించాయి.. ఇంటి కి మంటలు అంటుకున్నాయి. ఇళ్ళు ముందు భాగం కాలిపోయింది.. బైక్ డిక్కీ లో ఉన్న లక్ష 90 వేయిల రూపాయలు కాలి బూడిదయ్యాయి..దీంతో.. ప్రాణాలు కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు పరుగులు తీశారు.

వీడియో ఇక్కడ చూడండి..

బైక్‌ కొనుగోలు చేసి కేవలం 40 రోజులు అయిందని ఇంతలోనే ఇలా పేలిపోవటంతో బాధితులు బోరు మంటున్నారు. బైక్ డీలర్‌తో వాగ్వాదానికి దిగారు. బైక్‌తోపాటు డిక్కీలో కాలిపోయిన డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వరి దాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు బైక్ డిక్కీ లో పెట్టారు.. ఈ డబ్బులన్నీ కాళిపోయాయి.. తమకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు బాధితుడు తిరుపతి రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..