Cyber Crime: రోజుకు రూ. 3 కోట్లు.. తెలంగాణలో సైబర్‌ దొంగలు దోచేస్తున్న సొమ్ము ఇది

మరీ ముఖ్యంగా తెలంగాణలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజుకు ఏకంగా రూ. 3 కోట్ల డబ్బు సైబర్‌ నేరస్థుల పాలవుతున్నట్లు తేలింది. గడిచి ఐదు వారాలుగా.. అంటే 35 రోజులుగా.. ప్రతి రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల...

Cyber Crime: రోజుకు రూ. 3 కోట్లు.. తెలంగాణలో సైబర్‌ దొంగలు దోచేస్తున్న సొమ్ము ఇది
Cyber Crimes
Follow us

|

Updated on: Feb 13, 2024 | 10:48 AM

సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయి కదా ఇంకేం భయం ధీమాగా ఉంటే పరిస్థితులు లేవు. అలా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో డబ్బులను దోచేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పైగా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

మరీ ముఖ్యంగా తెలంగాణలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజుకు ఏకంగా రూ. 3 కోట్ల డబ్బు సైబర్‌ నేరస్థుల పాలవుతున్నట్లు తేలింది. గడిచి ఐదు వారాలుగా.. అంటే 35 రోజులుగా.. ప్రతి రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల చొప్పున.. అక్షరాల 150 కోట్ల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇక రకరకాల మార్గాల్లో వల విసురుతూ డబ్బులు కాజేస్తున్నారు. వీడియో గేమ్స్‌ పేరుతో, పార్ట్ టైమ్‌ జాబ్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. కేవలం వీడియోలకు లైక్‌ కొడితే చాలంటూ నమ్మిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఇలా డబ్బులు కోల్పోతున్న వారిలో చదువుకోలేని వారు ఉన్నారనుకుంటే పొరబడినట్లే, డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసిన వారు కూడా సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవల కేవైసీ అప్‌డేట్‌ పేరుతో కూడా నేరాలు జరుగుతున్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో ఏకంగా సైబర్‌ నేరస్థులు ఏకంగా రూ. 150 కోట్లు కొట్టేశారు.

ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడకూడదంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెనుకాముందు ఆలోచించకుండా ఎలాంటి లింక్స్‌ క్లిక్‌ చేయకూడదని చెబుతున్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడతోనే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ జరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాల్సి అవసరం ఉందని సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఉచితంగా డబ్బులు వస్తున్నాయంటే కచ్చితంగా ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోతే వెంటనే.. 87126 72222 నెంబర్ కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. www.cybercrime.go.in లో లేదా 1930కి కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!