AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర.. పాల్గొననున్న డీకే శివకుమార్..

Telangana Elections: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రనేతలంతా తెలంగాణ ప్రచారాన్ని ప్రారంభించారు. తొలివిడత విజయభేరి బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి అగ్రనేతలు రెండో విడత బస్సు యాత్రను చేపట్టనున్నారు. కాంగ్రెస్​పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది.

Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర.. పాల్గొననున్న డీకే శివకుమార్..
Dk Shivakumar
Shaik Madar Saheb
|

Updated on: Oct 28, 2023 | 9:11 AM

Share

Telangana Elections: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రనేతలంతా తెలంగాణ ప్రచారాన్ని ప్రారంభించారు. తొలివిడత విజయభేరి బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి అగ్రనేతలు రెండో విడత బస్సు యాత్రను చేపట్టనున్నారు. కాంగ్రెస్​పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. నవంబర్​2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగనుంది. రెండో విడతలో 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయనున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్​లోని తాండూరు, పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు. ఆదివారం ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే మెదక్​లోక్​సభ సెగ్మెంట్​లోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్​లో బస్సు యాత్రలో పాల్గొంటారు. సంగారెడ్డి, మెదక్‌లో జరిగే సభల్లో ఖర్గే పాల్గొంటారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ షెడ్యూల్ ఇదే..

ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే.. తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాల్లో డికె శివకుమార్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరులో, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిగిలో, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు డికె శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ప్రియాంక గాంధీ..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈనెల 30వ తేదీన భువనగరి పార్లమెంట్​సెగ్మెంట్‌లోని జనగామ, ఆలేరు, భువనగిరి, 31న నల్గొండ పార్లమెంట్​సెగ్మెంట్లలోని నాగార్జునసాగర్, నాగర్​కర్నూల్​సెగ్మెంట్లలోని కొల్లాపూర్‌లో బస్సు యాత్ర నిర్వహిస్తారు.

నవంబర్ 1 నుంచి రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ నవంబర్​1న నాగర్​కర్నూల్​పార్లమెంట్​ సెగ్మెంట్లలోని కల్వకుర్తి, మహబూబ్​నగర్​ సెగ్మెంట్లలోని జడ్చర్ల, షాద్​నగర్, నవంబర్​ 2న మల్కాజ్​గిరి పార్లమెంట్​ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..