CM KCR: గిరిజనులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన..

వారం రోజుల్లోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉండగా.. సీఎం ప్రకటనతో గిరిజనులకు మరో 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి

CM KCR: గిరిజనులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన..
Ts Cm Kcr
Follow us

|

Updated on: Sep 17, 2022 | 5:25 PM

CM KCR announces 10 percent reservation for tribals : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ సమైక్యత దినోత్సవం రోజున గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. వారం రోజుల్లోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు ఉండగా.. సీఎం ప్రకటనతో గిరిజనులకు మరో 4 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. విద్య, ఉద్యోగ నియామకాల్లో సైతం గిరిజనులకు ప్రాధాన్యత పెరగనుంది. రిజర్వేషన్లతోపాటు త్వరలోనే గిరిజన బంధును కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షలు సాయం చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ’ లో సీఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు.

ముందుగా బంజారా, గిరిజన భవన్‌ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలంటూ సూచించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు 5, 6శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. కేంద్రానికి పంపి ఏడేళ్లు గడిచినా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రధాని, హోం మంత్రిని అడుగుతున్నా.. ఎందుకు తొక్కిపెడుతున్నారంటూ విమర్శించారు. చేతులు జోడించి తెలంగాణ గడ్డపై నుంచి ప్రధానిని అభ్యర్థిస్తున్నా.. రాష్ట్రపతి ముద్ర కొట్టించి పంపిస్తే మేం జీవో విడుదల చేస్తామంటూ సూచించారు.

న్యాయమైన హక్కునే కోరుతున్నామని.. ఎనిమిదేళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేసిందా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తోందని తెలిపారు. రిజర్వేషన్లతోపాటు త్వరలో ‘గిరిజన బంధు’ ప్రారంభిస్తామని తెలిపారు. సంపద పెంచడం.. పేదలకు పంచడం.. ఇదే తమ సిద్ధాంతమని, పోడు రైతులకు భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మళ్లీ కల్లోలాలకు గురి కావద్దని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు